తెలంగాణ:కొత్తగా 1087 కరోనా కేసులు
- June 27, 2020హైదరాబాద్:తెలంగాణలో కరోన వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. శనివారం కొత్తగా 1087మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఇప్పటివరకు ఒక్కరోజులో ఇంత పెద్ద సంఖ్యలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 13436 కి చేరింది. ఇప్పటివరకు 4928 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇక శనివారం కరోనాతో ఆరుగురు మృతి చెందడంతో రాష్ట్రంలో కరోనాతో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 243కి పెరిగింది. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 8265కి చేరింది. ఈ మేరకు శనివారం తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ రోజు అత్యధింగా జీహెచ్ఎంసీ పరిధిలో 888 కరోనా కేసులు నమోదయ్యాయి.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- ఇక డ్రైవింగ్ టెస్ట్ కోసం RTO ఆఫీస్ వెళ్లాల్సిన అవసరం లేదు..
- హైదరాబాద్ పై కోల్కతా విజయం
- తెలంగాణలోని 10 వర్సిటీలకు ఇన్ఛార్జి వీసీల నియామకం
- సింగపూర్ విమానంలో భారీ కుదుపులు...ఒకరి మృతి
- అమెరికా కోర్టు న్యాయమూర్తిగా తెలుగు మహిళ జయ బాడిగ
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి..భారత్ సంతాపం
- ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: బెంగళూరు పోలీస్ కమిషనర్
- జూన్ 1 నుండి సింగిల్ యూజ్ స్టైరోఫోమ్ ఉత్పత్తుల బ్యాన్
- ప్రస్తుత ట్రాఫిక్ రికార్డును బద్దలు కొట్టనున్న DXB..!
- నకిలీ వెబ్సైట్ల గురించి పోలీసుల హెచ్చరిక