మస్కట్:విమాన ప్రయాణికులకు 4 గంటల ముందే ఎయిర్ పోర్ట్ చేరుకోవాలి..
- June 28, 2020
మస్కట్:కరోనా నేపథ్యంలో విమాన ప్రయాణికులకు ఒమన్ ప్రభుత్వం కొన్ని కీలక సూచనలు చేసింది. త్వరలోనే కమర్షియల్ విమాన సర్వీసులను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్న ఒమన్ ప్రభుత్వం..ఇక నుంచి ప్రయాణికులు అందరూ ఫ్లైట్ టైంకి 4 గంటల ముందే ఎయిర్ పోర్టుకు చేరుకోవాలని సూచించింది. ఈ మేరకు ఒమన్ లోని విమానాశ్రయాలకు ఆదేశాలు కూడా జారీ చేసింది. అంతేకాదు వీలైనంత వరకు ప్రయాణానికి అవసరమయ్యే ప్రక్రియను ఆన్ లైన్ లోనే పూర్తి చేసుకోవాలని కోరింది. అలాగే టికెట్ల కొనుగోళ్లలోనూ ఈ-టికెట్లకే ప్రధాన్యత ఇవ్వాలంది. ప్రయాణికులు తమ వెంట ఒకే ఒక్క హ్యాండ్ బ్యాగ్ తీసుకొచ్చేందుకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. ఎయిర్ట్ పోర్ట్ టెర్మినల్ లో ఉన్నంత సేపు ఖచ్చితంగా మాస్కులు ధరించే ఉండాలని కూడా ప్రభుత్వం సూచించింది. ఒకవేళ ఎవరికైనా కోవిడ్-19 లక్షణాలు ఉన్నట్లు అనిపిస్తే విమానాశ్రయానికి రావొద్దని కోరింది. అలాంటి వారు వెంటనే సంబంధిత ఆరోగ్య కేంద్రానికి వెళ్లి చెకప్ చేయించుకోవాలని ప్రభుత్వం సూచించింది.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!