పాకిస్థాన్ లో రెండు లక్షలు దాటిన కరోనా కేసులు
- June 28, 2020పాకిస్థాన్ లో కరోనా వైరస్ విశ్వరూపం ప్రదర్శిస్తోంది. ఆదివారం 4,072 కొత్త కేసులు నమోదయ్యాయి,దాంతో పాజిటివ్ కేసుల సంఖ్య 202,955 కు పెరిగింది. వ్యాధి సోకిన వారిలో 92,000 మందికి పైగా అంటే 45 శాతం మందికి కోలుకోగా, 2,805 మందికి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఇప్పటివరకూ మొత్తం 4,118 మరణాలు సంభవించాయి. గత 20 రోజులలో 100,000 కంటే ఎక్కువ కొత్త కేసులు నమోదయ్యాయి, అయితే జూన్ 30 నాటికి ఈ సంఖ్య 225,000 వరకు ఉండవచ్చని ప్రభుత్వ అంచనాలు సూచిస్తున్నాయి.
మరోవైపు ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మొదటి నుండి వైరస్ పై పోరాడటానికి ఎక్కువకాలం లాక్డౌన్ పెట్టడాన్ని వ్యతిరేకించారు, దేశ ఆర్థిక వ్యవస్థ దానిని భరించలేదని వాదించారు. దీంతో లాక్ డౌన్ లేకపోవడంతో ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో విచ్చలవిడిగా తిరుగుతున్నారు. దాంతో వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇదిలావుంటే పాకిస్థాన్ లో జూన్ 14 నుండి 20 ప్రధాన నగరాల్లో వైరస్ హాట్స్పాట్లను గుర్తించారు. ఇక్కడే లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయాలనీ ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.
తాజా వార్తలు
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల