పాకిస్థాన్ లో రెండు లక్షలు దాటిన కరోనా కేసులు
- June 28, 2020
పాకిస్థాన్ లో కరోనా వైరస్ విశ్వరూపం ప్రదర్శిస్తోంది. ఆదివారం 4,072 కొత్త కేసులు నమోదయ్యాయి,దాంతో పాజిటివ్ కేసుల సంఖ్య 202,955 కు పెరిగింది. వ్యాధి సోకిన వారిలో 92,000 మందికి పైగా అంటే 45 శాతం మందికి కోలుకోగా, 2,805 మందికి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఇప్పటివరకూ మొత్తం 4,118 మరణాలు సంభవించాయి. గత 20 రోజులలో 100,000 కంటే ఎక్కువ కొత్త కేసులు నమోదయ్యాయి, అయితే జూన్ 30 నాటికి ఈ సంఖ్య 225,000 వరకు ఉండవచ్చని ప్రభుత్వ అంచనాలు సూచిస్తున్నాయి.
మరోవైపు ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మొదటి నుండి వైరస్ పై పోరాడటానికి ఎక్కువకాలం లాక్డౌన్ పెట్టడాన్ని వ్యతిరేకించారు, దేశ ఆర్థిక వ్యవస్థ దానిని భరించలేదని వాదించారు. దీంతో లాక్ డౌన్ లేకపోవడంతో ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో విచ్చలవిడిగా తిరుగుతున్నారు. దాంతో వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇదిలావుంటే పాకిస్థాన్ లో జూన్ 14 నుండి 20 ప్రధాన నగరాల్లో వైరస్ హాట్స్పాట్లను గుర్తించారు. ఇక్కడే లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయాలనీ ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!