కువైట్: రెసిడెన్సీ టాన్స్ ఫర్, వెహికిల్ ఓనర్ షిప్ బదిలీ సేవలు మంగళవారం నుంచి ప్రారంభం
- June 28, 2020
కువైట్ సిటీ:లాక్ డౌన్ తర్వాత మళ్లీ సాధారణ పరిస్థితుల నెలకొల్పడంలో భాగంగా మంత్రిమండలి సూచనల మేరకు ప్రభుత్వ కార్యలయాలు తమ సేవలను ప్రారంభించబోతున్నాయి. మంగళవారం నుంచి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రభుత్వ కార్యాలయాలు తెరిచిఉంటాయని అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. నివాసిన అనుమతులకు సంబంధించి మంగళవారం నుంచి ప్రక్రియ ప్రారంభం కానుంది. తొలిసారిగా కువైట్ నివాస అనుమతి పొందాలనుకునే వారు, నివాస అనుమతిని ఒక స్పాన్సర్ నుంచి మరోకరిని బదిలి చేయాలనుకునేవారు మినిస్ట్రి ఆఫీస్ లో మంగళవారం నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అలాగే డ్రైవింగ్ టెస్ట్ పాస్ అయిన వారికి మంగళవారం నుంచి డ్రైవింగ్ లైసెన్స్ ల జారీ కొనసాగుతుందని ట్రాఫిక్
విభాగం అధికారులు వెల్లడించారు. వాహనాల రెన్యూవల్, వాహనాల ఓనర్ షిప్ బదిలీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి జరిమానా చెల్లింపులు కూడా ఇక ఆఫీసులోనే చేయవచ్చు. అయితే..ముందుగా www.moi.gov.kwలో అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదిలాఉంటే..ప్రభుత్వ సేవల కోసం మినిస్ట్రి కార్యాలయాలకు వచ్చే వారు ఖచ్చితంగా భౌతిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని అంతర్గత మంత్రిత్వ శాఖ సూచించింది.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







