యూఏఈ వీసాదారులకు అనుమతి..ట్రావెల్ ఎన్వోసీపై ఎంబసీ క్లారిటీ
- June 30, 2020
యూఏఈ:భారత్ నుంచి యూఏఈ వెళ్లాలని అనుకుంటున్న వీసాదారులకు ఊరట కలిగించే ప్రకటన చేసింది ఇండియాలోని యూఏఈ రాయబార కార్యాలయం. కొన్ని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా యూఏఈ ప్రయాణానికి సంబంధించి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇస్తామని రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది. అయితే..నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ పొందాలంటే యూఏఈ ప్రభుత్వ షరతులకు లోబడి అన్ని నిబంధనలకు ప్రవాసీయులు అర్హులై ఉండాలని కూడా స్పష్టం చేసింది. ఇదిలాఉంటే..ప్రస్తుత పరిస్థితుల్లో భారత ప్రభుత్వం అంతర్జాతీయ విమాన సర్వీసుల విషయంలో తీసుకునే నిర్ణయాలను వీసాదారులు ఎప్పటికప్పుడు గమనిస్తుండాలని కూడా రాయబారం కార్యాలయం అధికారులు సూచించారు. విమానాశ్రయాలను మూసివేస్తుండటంతో ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా వీసాదారుల ప్రయాణాలు ఆధారపడి ఉంటాయని వెల్లడించారు. ఈ విషయంలో ఇతర పురోగతి ఏమైనా ఉంటే..అధికారికంగా ప్రకటన విడుదల చేస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు