కువైట్:ఆగస్ట్ 1 నుంచి కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..
- June 30, 2020
కువైట్ సిటీ:దేశంలో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొల్పడంలో భాగంగా..విమాన సర్వీసులను పునరుద్ధరించాలని నిర్ణయించింది కువైట్ ప్రభుత్వం. ఆగస్ట్ 1 నుంచి కమర్షియల్ ఫ్లైట్స్ ను నడపాలని మంత్రి మండలి తీర్మానించింది. మొత్తం మూడు దశల్లో విమాన సర్వీసులను పూర్తి స్థాయిలో ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. అయితే..ఇతర దేశాల నిబంధనలకు అనుగుణంగా అనుమతి ఉన్న విమానాశ్రయాలకు మాత్రమే కువైట్ నుంచి సర్వీసులను నడపనున్నారు. తొలి దశలో 30 శాతం విమానాలను పునరుద్ధరిస్తారు. ఆ తర్వాత రెండో దశలో సర్వీసులను 60 శాతానికి పెంచుతారు. ఇక మూడో దశలో మొత్తం సర్వీసులను ప్రయాణికులకు అందుబాటులోకి తీసువస్తారు. నిజానికి ఈ నెల మొదట్లోనే విమాన సర్వీసులను పునరుద్ధరణపై నిర్ణయం తీసుకున్నా..కేబినెట్ నిర్ణయం తర్వాత ఇప్పుడు అధికారికంగా ప్రకటించారు. కరోనా నేపథ్యంలో అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటామని కూడా డీజీసీఏ వెల్లడించింది.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







