మస్కట్:వాహనాల స్మగ్లింగ్, మోసం కేసుల్లో 11 మంది అరెస్ట్

- July 01, 2020 , by Maagulf
మస్కట్:వాహనాల స్మగ్లింగ్, మోసం కేసుల్లో 11 మంది అరెస్ట్

మస్కట్:వాహనాల స్మగ్లింగ్ తో పాటు దొంగ వాహనాలను అమాయకులకు అమ్ముతూ మోసం చేస్తున్న 11 మంది సభ్యుల ముఠాను రాయల్ ఓమన్ పోలీసులు మస్కట్ లో అరెస్ట్ చేశారు. వారి దగ్గరి నుంచి 21 దొంగిలించిన వాహనాలను సీజ్ చేశారు. అవన్ని ఇతర సుల్తానేట్ నుంచి చోరీ చేసుకొచ్చిన వాహనాలేనని రాయల్ ఓమన్ పోలీసులు తెలిపారు. దొంగిలించిన వాహనాలను తీసుకొచ్చి సుల్తానేట్ లోని పౌరులు, ప్రవాసీయులకు అమ్ముతున్నట్లు పోలీసులు తమ దర్యాప్తులో తేల్చారు. అలాంటి నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చౌకగా వస్తున్నాయని దొంగిలించిన వాహనాలను, సరైన పత్రాలు లేని వాహనాలను కొని చిక్కుల్లో పడొద్దని హెచ్చరించారు. అరెస్ట్ చేసిన 11 మంది న్యాయ విచారణకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com