మస్కట్:వాహనాల స్మగ్లింగ్, మోసం కేసుల్లో 11 మంది అరెస్ట్
- July 01, 2020
మస్కట్:వాహనాల స్మగ్లింగ్ తో పాటు దొంగ వాహనాలను అమాయకులకు అమ్ముతూ మోసం చేస్తున్న 11 మంది సభ్యుల ముఠాను రాయల్ ఓమన్ పోలీసులు మస్కట్ లో అరెస్ట్ చేశారు. వారి దగ్గరి నుంచి 21 దొంగిలించిన వాహనాలను సీజ్ చేశారు. అవన్ని ఇతర సుల్తానేట్ నుంచి చోరీ చేసుకొచ్చిన వాహనాలేనని రాయల్ ఓమన్ పోలీసులు తెలిపారు. దొంగిలించిన వాహనాలను తీసుకొచ్చి సుల్తానేట్ లోని పౌరులు, ప్రవాసీయులకు అమ్ముతున్నట్లు పోలీసులు తమ దర్యాప్తులో తేల్చారు. అలాంటి నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చౌకగా వస్తున్నాయని దొంగిలించిన వాహనాలను, సరైన పత్రాలు లేని వాహనాలను కొని చిక్కుల్లో పడొద్దని హెచ్చరించారు. అరెస్ట్ చేసిన 11 మంది న్యాయ విచారణకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..