మస్కట్:వాహనాల స్మగ్లింగ్, మోసం కేసుల్లో 11 మంది అరెస్ట్
- July 01, 2020
మస్కట్:వాహనాల స్మగ్లింగ్ తో పాటు దొంగ వాహనాలను అమాయకులకు అమ్ముతూ మోసం చేస్తున్న 11 మంది సభ్యుల ముఠాను రాయల్ ఓమన్ పోలీసులు మస్కట్ లో అరెస్ట్ చేశారు. వారి దగ్గరి నుంచి 21 దొంగిలించిన వాహనాలను సీజ్ చేశారు. అవన్ని ఇతర సుల్తానేట్ నుంచి చోరీ చేసుకొచ్చిన వాహనాలేనని రాయల్ ఓమన్ పోలీసులు తెలిపారు. దొంగిలించిన వాహనాలను తీసుకొచ్చి సుల్తానేట్ లోని పౌరులు, ప్రవాసీయులకు అమ్ముతున్నట్లు పోలీసులు తమ దర్యాప్తులో తేల్చారు. అలాంటి నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చౌకగా వస్తున్నాయని దొంగిలించిన వాహనాలను, సరైన పత్రాలు లేని వాహనాలను కొని చిక్కుల్లో పడొద్దని హెచ్చరించారు. అరెస్ట్ చేసిన 11 మంది న్యాయ విచారణకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- ఖతార్ లో 2026-2027 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభం..!!
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం







