ధమ్మామ్: వచ్చే నెలలో కింగ్ ఫహ్ద్ కాజ్ వే ప్రారంభించే అవకాశాలు
- July 01, 2020
ధమ్మామ్:దాదాపుగా నాలుగు నెలలుగా మూతపడిన కింగ్ ఫహ్ద్ కాజ్ వేపై ఎట్టకేలకు వాహనాలను అనుమతించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సౌదీ, బహ్రెయిన్ ను కలిపే ఈ కీలక కాజ్ వేను ఈ నెలాఖరు నాటికి ప్రారంభించే యోచనలో ఉంది బహ్రెయిన్ ప్రభుత్వం. కాజ్ వేపై వాహనాలను అనుమతించటం ద్వారా దేశంలో పర్యాటక రంగానికి ఊతం ఇచ్చినట్లు అవుతుంది. దీనికి సంబంధించి సమావేశమైన బహ్రెయిన్ కోఆర్డినేషన్ కమిటీ..కాజ్ వే రహదారిని జులై 27 నుంచి ప్రారంభించే అవకాశాలపై చర్చించింది. ప్రస్తుతం సాధారణ పరిస్థితులను నెలకొల్పడంలో భాగంగా అన్ లాక్ ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇందుకు అనుకూల వాతావరణం నెలకొల్పేందుకు గల్ఫ్ దేశాల మండలి కూడా దేశాల మధ్య సరిహద్దు రవాణాకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో సౌదీ, బహ్రెయిన్ ను కలిసే కింగ్ ఫహ్ద్ కాజ్ వేపై వాహనాలను అనుమతించేందుకు కసరత్తు చేస్తోంది బహ్రెయిన్. తద్వారా బహ్రెయిన్ లో పర్యాటక రంగానికి ఎంతో ఊరట కలగనుంది. గల్ఫ్ దేశాల నుంచి వచ్చే పర్యటకులు, ముఖ్యంగా సౌదీ నుంచి వచ్చే వారికి కింగ్ ఫహ్ద్ కాజ్ వే ఎంతగానో ఉపకరిస్తుంది. నిజానికి బహ్రెయిన్ లో పర్యటించే వారిలో సౌదీ నుంచి వచ్చే వారే ఎక్కువగా ఉంటారు. గతేడాది మొత్తం 11 మిలియన్ల మంది బహ్రెయిన్ లో పర్యటిస్తే అందులో 88 శాతం సౌదీ నుంచి వచ్చిన వారే. కింగ్ ఫహ్ద్ పై వాహనాల అనుమతి బహ్రెయిన్ ఎంత కీలకమైందంటే..ఈ కాజ్ వే పై ప్రతి రోజు దాదాపు 75 వేల మంది ప్రయాణిస్తుంటారు. అయితే..కరోనా వైరస్ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు పాటించేలా చర్యలు తీసుకుంటామని కూడా బహ్రెయిన్ కోఆర్డినేషన్ కమిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..







