ధమ్మామ్: వచ్చే నెలలో కింగ్ ఫహ్ద్ కాజ్ వే ప్రారంభించే అవకాశాలు
- July 01, 2020
ధమ్మామ్:దాదాపుగా నాలుగు నెలలుగా మూతపడిన కింగ్ ఫహ్ద్ కాజ్ వేపై ఎట్టకేలకు వాహనాలను అనుమతించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సౌదీ, బహ్రెయిన్ ను కలిపే ఈ కీలక కాజ్ వేను ఈ నెలాఖరు నాటికి ప్రారంభించే యోచనలో ఉంది బహ్రెయిన్ ప్రభుత్వం. కాజ్ వేపై వాహనాలను అనుమతించటం ద్వారా దేశంలో పర్యాటక రంగానికి ఊతం ఇచ్చినట్లు అవుతుంది. దీనికి సంబంధించి సమావేశమైన బహ్రెయిన్ కోఆర్డినేషన్ కమిటీ..కాజ్ వే రహదారిని జులై 27 నుంచి ప్రారంభించే అవకాశాలపై చర్చించింది. ప్రస్తుతం సాధారణ పరిస్థితులను నెలకొల్పడంలో భాగంగా అన్ లాక్ ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇందుకు అనుకూల వాతావరణం నెలకొల్పేందుకు గల్ఫ్ దేశాల మండలి కూడా దేశాల మధ్య సరిహద్దు రవాణాకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో సౌదీ, బహ్రెయిన్ ను కలిసే కింగ్ ఫహ్ద్ కాజ్ వేపై వాహనాలను అనుమతించేందుకు కసరత్తు చేస్తోంది బహ్రెయిన్. తద్వారా బహ్రెయిన్ లో పర్యాటక రంగానికి ఎంతో ఊరట కలగనుంది. గల్ఫ్ దేశాల నుంచి వచ్చే పర్యటకులు, ముఖ్యంగా సౌదీ నుంచి వచ్చే వారికి కింగ్ ఫహ్ద్ కాజ్ వే ఎంతగానో ఉపకరిస్తుంది. నిజానికి బహ్రెయిన్ లో పర్యటించే వారిలో సౌదీ నుంచి వచ్చే వారే ఎక్కువగా ఉంటారు. గతేడాది మొత్తం 11 మిలియన్ల మంది బహ్రెయిన్ లో పర్యటిస్తే అందులో 88 శాతం సౌదీ నుంచి వచ్చిన వారే. కింగ్ ఫహ్ద్ పై వాహనాల అనుమతి బహ్రెయిన్ ఎంత కీలకమైందంటే..ఈ కాజ్ వే పై ప్రతి రోజు దాదాపు 75 వేల మంది ప్రయాణిస్తుంటారు. అయితే..కరోనా వైరస్ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు పాటించేలా చర్యలు తీసుకుంటామని కూడా బహ్రెయిన్ కోఆర్డినేషన్ కమిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్
- గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు









