దుబాయ్:మోసాలకు పాల్పడుతున్న 20 గ్యాంగులు..47 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు
- July 01, 2020
దుబాయ్:మాయదారి మాటలు, డేటింగ్ లింకులతో ప్రజలను మోసం చేస్తున్న అఫ్రికన్ గ్యాంగ్ ఆటకట్టించారు దుబాయ్ పోలీసులు. ప్రజల్ని మోసం చేస్తున్న 20 గ్యాంగులను గుర్తించి అందులోని 47 మంది సభ్యుల్ని అరెస్ట్ చేశారు. ప్రజల బలహీనతల్ని అవకాశంగా మలుచుకొని కట్టుకథలతో ప్రజలను లూటీ చేస్తున్నాయి ఆఫ్రికన్ గ్యాంగులు. సైబర్ నేరాలు, మోసాలు, దోపిడి, బ్లాక్ మెయిలింగ్ ఇలా అన్ని రకాలుగా మోసాలకు పాల్పడుతున్నారు. చివరికి లాక్ డౌన్ సమయంలో అంతర్జాతీయ సరిహద్దులు మూసివేసిన ఘటనను కూడా తమకు అనుకూలంగా మలుచుకున్నారు. ఇళ్లలో పని చేసేందుకు కార్మికులను రిక్రూట్ చేస్తామంటూ కొందరి దగ్గర డబ్బులు వసూలు చేసి ఆ తర్వాత వాళ్లను హ్యాండ్ ఇచ్చారు. ఓ జంట ఇలా డొమస్టిక్ వర్కర్స్ రిక్రూట్మెంట్ పేరుతో మోసాలకు పాల్పడినట్లు దుబాయ్ పోలీసులు వెల్లడించారు. కొన్ని డేటింగ్ లింకులను పంపించి..యువతను వలలోకి దించి సైబర్ నేరాలకు పాల్పడినట్లు తెలిపారు. ఆపరేషన్ క్రైమ్ ఆఫ్ షాడోతో ఆఫ్రికన్ ముఠాలను పట్టుకున్నారు పోలీసులు. గుర్తు తెలియని వ్యక్తులు పంపించిన లింకుల జోలికి వెళ్లొద్దని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరించారు. అలాగే మెసేజ్ లకు కూడా స్పందించొద్దని హెచ్చరించారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?