కరోనా ఎఫెక్ట్:దేశం వదిలి వెళ్లిన లక్ష మంది ప్రవాసీయులు..
- July 02, 2020
కువైట్ సిటీ:కరోనా ప్రభావం తర్వాత కువైట్ నుంచి స్వదేశాలకు వెళ్లిన ప్రవాసీయుల గణాంకాలను విడుదల చేసింది పౌరవిమానయాన సంస్థ-DGCA. ఒక్క జూన్ నెలలోనే దాదాపు లక్ష మంది ప్రవాసీయులు కువైట్ ను వదిలి వెళ్లారని వెల్లడించింది. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దాదాపు 590 విమానాలు ప్రవాసీయులను ప్రపంచంలోని తమ తమ గమ్యస్థానాలకు చేరవేశాయని వెల్లడించింది. డీజీసీఏ విడుదల చేసిన గణాంకాల మేరకు కువైట్ వదిలి వెళ్లిన ప్రవాసీయుల్లో ఈజిప్టియన్లు మొదటి వరుసలో ఉన్నారు. 49,986 మంది జూన్ నెలలో కువైట్ వదిలి స్వదేశానికి వెళ్లిపోయారు. ఆ తర్వాత స్థానం ప్రవాస భారతీయులదే. 185 విమానాల్లో 30,033 మంది ప్రవాసీయులు ఇండియా చేరుకున్నారు. 32 ఫ్లైట్స్ లో 6492 మంది ఖతార్ వెళ్లారు. అయితే..ఖతార్ వెళ్లిన వారిలో ఎక్కువ మంది యూరోపియన్, అమెరికన్ జాతీయులే ఉన్నారు. వాళ్లంతా ముందుగా ఖతార్ చేరుకొని అక్కడి నుంచి వారి స్వదేశానికి చేరుకున్నట్లు డీజీసీఏ వెల్లడించింది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు