యాంటీ కోవిడ్ నిబంధనలు ఉల్లంఘన: పలువురికి జరిమానాలు
- July 02, 2020
యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్, కరోనా వైరస్ (కోవిడ్ 19) నేపథ్యంలో ఉల్లంఘనలకు పాల్పడినవారికి జరీమానాలు విధించడం జరిగింది. అలాగే వారి పేర్లను, వారి ఫొటోల్ని వెల్లడించారు. 2,000 దిర్హామ్ ల నుంచి 10,000 దిర్హామ్ ల వరకు జరీమానాలు విధించారు. మాస్క్లు ధరించకపోవడం, కర్ఫ్యూ నిబంధనల్ని ఉల్లంఘించడం, పార్టీలు నిర్వహించడం వంటి చర్యలకు ఈ జరీమానాలు విధించడం జరిగింది. హెల్త్ అండ్ సేఫ్టీ రెగ్యులేషన్స్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవర్నీ ఉపేక్షించే అవకాశమే లేదని చెప్పడం కోసం ఈ నేమ్ అండ్ షేమ్ చర్యలు కూడా తీసుకున్నారు. ముగ్గురు ఆసియా వ్యక్తుల ఫొటోల్ని పబ్లిష్ చేశారు. ఓ ఎమిరేటీ అలాగే ఇద్దరు ఆసియా వ్యక్తుల ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. అరబ్ జాతీయుడొకరికి 10,000 దిర్హామ్ ల జరీమానా విధించడం జరిగింది. మరో ముగ్గురు అరబ్స్కి ఓ ఆసియా జాతీయుడికి 5,000 దిర్హామ్ ల చొప్పున జరీమానా విధించారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







