యాంటీ కోవిడ్ నిబంధనలు ఉల్లంఘన: పలువురికి జరిమానాలు
- July 02, 2020
యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్, కరోనా వైరస్ (కోవిడ్ 19) నేపథ్యంలో ఉల్లంఘనలకు పాల్పడినవారికి జరీమానాలు విధించడం జరిగింది. అలాగే వారి పేర్లను, వారి ఫొటోల్ని వెల్లడించారు. 2,000 దిర్హామ్ ల నుంచి 10,000 దిర్హామ్ ల వరకు జరీమానాలు విధించారు. మాస్క్లు ధరించకపోవడం, కర్ఫ్యూ నిబంధనల్ని ఉల్లంఘించడం, పార్టీలు నిర్వహించడం వంటి చర్యలకు ఈ జరీమానాలు విధించడం జరిగింది. హెల్త్ అండ్ సేఫ్టీ రెగ్యులేషన్స్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవర్నీ ఉపేక్షించే అవకాశమే లేదని చెప్పడం కోసం ఈ నేమ్ అండ్ షేమ్ చర్యలు కూడా తీసుకున్నారు. ముగ్గురు ఆసియా వ్యక్తుల ఫొటోల్ని పబ్లిష్ చేశారు. ఓ ఎమిరేటీ అలాగే ఇద్దరు ఆసియా వ్యక్తుల ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. అరబ్ జాతీయుడొకరికి 10,000 దిర్హామ్ ల జరీమానా విధించడం జరిగింది. మరో ముగ్గురు అరబ్స్కి ఓ ఆసియా జాతీయుడికి 5,000 దిర్హామ్ ల చొప్పున జరీమానా విధించారు.
తాజా వార్తలు
- ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- జెడ్డా ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ వాయిదా..!!
- ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- డెలివరీ ప్లాట్ఫామ్లలో పొగాకు, సిగరెట్ల అమ్మకాల పై నిషేధం..!!
- ఆసియా దేశాల రాయబారులతో సౌదీ అరేబియా చర్చలు..!!
- సుల్తాన్ తో ఈజిప్టు విదేశాంగ మంత్రి భేటీ..!!
- ‘ఈదియా’ కోసం 10 ATMలు ఏర్పాటు: అవెన్యూస్
- నిరంతర తనిఖీలతో పటిష్ఠంగా ఖతార్ మార్కెట్..!!
- బహ్రెయిన్ లో 45 మంది డ్రైవర్ల పై చట్టపరమైన చర్యలు..!!
- తాత్కాలిక సస్పెన్షన్ తర్వాత ఫ్లైట్స్ క్రమంగా పునఃప్రారంభం..!!









