కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ ఇకలేరు
- July 03, 2020ముంబై:బాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. ఇటీవల రిషీ కపూర్, ఇర్ఫాన్ ఖాన్, సుశాంత్ సింగ్ రాజ్పుత్ తదితరులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా బాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ఖాన్ మృతి చెందారు. 71 ఏళ్ల సరోజ్ ఖాన్ గుండెపోటుతో శుక్రవారం తెల్లవారుజామున మరణించారు.
సరోజ్ ఖాన్ కొద్ది రోజుల క్రితం శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమెను బాంద్రాలోని గురునానక్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆమె శుక్రవారం కన్నుమూసారు.
సరోజ్ ఖాన్ను మదర్ ఆఫ్ డ్యాన్స్, కొరియోగ్రఫీ ఆఫ్ ఇండియాగా అభిమానులు పిలిచేవారు. సరోజ్ ఖాన్ 40 ఏళ్ళ కెరియర్లో 2000కి పైగా సినిమాలు చేశారు. శ్రీదేవి, మాధురీ దీక్షిత్ల వంటి స్టార్స్కి డ్యాన్స్ నేర్పించారు. దేవదాస్ మూవీలోని 'దోలా రే దోలా', తేజాబ్ లో మాధురీ దీక్షిత్ నర్తించిన 'ఏక్ దో తీన్', జబ్ వీ మెట్ సినిమాలోని 'యే ఇష్క్ హై' పాటల కొరియోగ్రఫీకి సరోజ్ ఖాన్ కు జాతీయ అవార్డులు లభించాయి. చివరిగా 2019లో కరణ్ జోహార్ నిర్మించిన కళంక్ చిత్రంలో మాధురీ నర్తించిన తబా హోగయీ పాటకు కొరియోగ్రఫీ చేశారు. సరోజ్ ఖాన్ మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు నివాళులు అర్పించారు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి