ఆ హోటల్ అంతా బంగారమే...చివరికి వాష్ బేసిన్ కూడా! వియత్నాంలో ప్రారంభం
- July 03, 2020వియత్నాంలో తొలి గోల్డ్ ప్లేటెడ్ హోటల్ ప్రారంభం అయ్యింది. పైకప్పు, సైడ్ వాల్స్, బాత్రూమ్స్ ఇలా అంతా బంగారు తాపడం ఉండటం ఆ హోటల్ ప్రత్యేకత. వియత్నాం రాజధాని హనోయ్ లో ఈ బంగారం తాపడం హోటల్ ను ఇటీవలె ప్రారంభించారు. కరోనా ఎఫెక్ట్ తర్వాత వియత్నాంలో పర్యాటక రంగంలోని పలు హోటల్స్, టూరిస్ట్ స్పాట్స్ కి ఇప్పుడిప్పుడే మళ్లీ ప్రారంభమవుతున్నాయి. కస్టమర్లు తమ హోటల్నే ఎంచుకునేలా బంగారు తాపడం అదనపు ఆకర్షణ కానుందని హోవా బిన్హ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ నిర్వాహకులు వెల్లడించారు. తమ హోటల్ సీలింగ్ దగ్గర్నుంచి వాష్ బేసిన్ వరకు అంతా బంగారుమయమే అని గర్వంగా చెబుతున్నారు. ఇందుకోసం దాదాపు టన్ను బంగారం వినియోగించినట్లు వెల్లడించారు. అంతా 24 క్యారెట్ గోల్డ్ ను ఉపయోగించామన్నారు.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్