ఆ హోటల్ అంతా బంగారమే...చివరికి వాష్ బేసిన్ కూడా! వియత్నాంలో ప్రారంభం
- July 03, 2020వియత్నాంలో తొలి గోల్డ్ ప్లేటెడ్ హోటల్ ప్రారంభం అయ్యింది. పైకప్పు, సైడ్ వాల్స్, బాత్రూమ్స్ ఇలా అంతా బంగారు తాపడం ఉండటం ఆ హోటల్ ప్రత్యేకత. వియత్నాం రాజధాని హనోయ్ లో ఈ బంగారం తాపడం హోటల్ ను ఇటీవలె ప్రారంభించారు. కరోనా ఎఫెక్ట్ తర్వాత వియత్నాంలో పర్యాటక రంగంలోని పలు హోటల్స్, టూరిస్ట్ స్పాట్స్ కి ఇప్పుడిప్పుడే మళ్లీ ప్రారంభమవుతున్నాయి. కస్టమర్లు తమ హోటల్నే ఎంచుకునేలా బంగారు తాపడం అదనపు ఆకర్షణ కానుందని హోవా బిన్హ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ నిర్వాహకులు వెల్లడించారు. తమ హోటల్ సీలింగ్ దగ్గర్నుంచి వాష్ బేసిన్ వరకు అంతా బంగారుమయమే అని గర్వంగా చెబుతున్నారు. ఇందుకోసం దాదాపు టన్ను బంగారం వినియోగించినట్లు వెల్లడించారు. అంతా 24 క్యారెట్ గోల్డ్ ను ఉపయోగించామన్నారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం