రెసిడెన్సీ వీసాలు ఉన్న ప్రవాసీయులు తిరిగి రావొచ్చు..కువైట్ స్పష్టీకరణ
- July 04, 2020కువైట్ సిటీ:లాక్ డౌన్ వివిధ దేశాల్లో ఉండిపోయిన కువైట్ రెసిడెన్సీ వీసాదారులు తిరిగి రావొచ్చని ఆ దేశ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆగస్ట్ 1 నుంచి కమర్షియల్ ఫ్లైట్ సర్వీసులు ప్రారంభం అవుతున్నాయని, అదే రోజు నుంచి అర్హత కలిగిన వీసాదారులు అంతా కువైట్ తిరిగి రావొచ్చని వెల్లడించింది. అయితే..కరోనా నేపథ్యంలో కువైట్ ప్రభుత్వం అనుసరిస్తున్న అన్ని మార్గదర్శకాలను రెసిడెన్సీ వీసాదారులు పాటించాల్సి ఉంటుందని కూడా స్పష్టం చేసింది. ప్రయాణానికి ముందే కరోనా సోకలేదని నిరూపించుకునేందుకు గుర్తింపు పొందిన పీసీఆర్ సర్టిఫికెట్ ను చూపించాల్సి ఉంటుంది. అలాగే విమానం ఎక్కే ముందే శ్లోనిక్ లో రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. అలాగే కువైట్ చేరుకున్నాక స్వీయ గృహ నిర్బంధంలోగానీ, ప్రభుత్వం, ఇతర సంస్థలు ఏర్పాటు చేసిన నిర్బంధ శిబిరాల్లోగాని ఉండేందుకు అంగీకరిస్తూ ముందస్తుగానే సంతకాలు చేయాలని కూడా షరతు విధించింది.
తాజా వార్తలు
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ