దోహా మున్సిపాలిటిలో 129 ఆహార ఉత్పత్తి కేంద్రాల మూసివేత
- July 04, 2020
దోహా:నిబంధనలు పాటించని, పాడైన ఆహారం కలిగి ఉన్న దాదాపు 129 ఆహార కేంద్రాలను దోహా మున్సిపాలిటి అధికారులు మూసివేయించారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు పలు అహార ఉత్పత్తి కేంద్రాలపై తనిఖీలు చేపట్టిన మున్సిపాలిటి అధికారులు ఈ మేరకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. దోహా మున్సిపాలిటి పరిధిలో మొత్తం 15 వేల తనిఖీలు చేపట్టినట్లు అధికారులు వివరించారు. పాక్షికంగా పాడైపోయి అనారోగ్య కారకంగా మారిన అహారాన్ని ఉత్పత్తి చేస్తున్న 588 మందికి నోటీసులు జారీ చేశామని వెల్లడించారు. అలాగే 490 అహార ఉత్పత్తి కేంద్రాలకు జరిమానాలు విధించామని అన్నారు. అలాగే వివిధ మాంసం ఉత్పత్తి కేంద్రాలపై తనిఖీలు చేపట్టారు. 10.5 టన్నుల పాడైపోయిన మాంసాన్ని గుర్తించి దాన్ని నాశనం చేశారు. అలాగే అనారోగ్యం కలిగించే స్థితిలో ఉన్న 1.3 టన్నుల చేప మాంసాన్ని కూడా నాశనం చేసినట్లు మున్సిపాలిటి అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!