దోహా మున్సిపాలిటిలో 129 ఆహార ఉత్పత్తి కేంద్రాల మూసివేత
- July 04, 2020దోహా:నిబంధనలు పాటించని, పాడైన ఆహారం కలిగి ఉన్న దాదాపు 129 ఆహార కేంద్రాలను దోహా మున్సిపాలిటి అధికారులు మూసివేయించారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు పలు అహార ఉత్పత్తి కేంద్రాలపై తనిఖీలు చేపట్టిన మున్సిపాలిటి అధికారులు ఈ మేరకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. దోహా మున్సిపాలిటి పరిధిలో మొత్తం 15 వేల తనిఖీలు చేపట్టినట్లు అధికారులు వివరించారు. పాక్షికంగా పాడైపోయి అనారోగ్య కారకంగా మారిన అహారాన్ని ఉత్పత్తి చేస్తున్న 588 మందికి నోటీసులు జారీ చేశామని వెల్లడించారు. అలాగే 490 అహార ఉత్పత్తి కేంద్రాలకు జరిమానాలు విధించామని అన్నారు. అలాగే వివిధ మాంసం ఉత్పత్తి కేంద్రాలపై తనిఖీలు చేపట్టారు. 10.5 టన్నుల పాడైపోయిన మాంసాన్ని గుర్తించి దాన్ని నాశనం చేశారు. అలాగే అనారోగ్యం కలిగించే స్థితిలో ఉన్న 1.3 టన్నుల చేప మాంసాన్ని కూడా నాశనం చేసినట్లు మున్సిపాలిటి అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ
- కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం, 8 కార్లు ఢీ..
- భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన