సౌదీ, యూఏఈ నుంచి గోల్డ్ స్మగ్లింగ్..ఇండియన్స్ నుంచి భారీగా బంగారం పట్టివేత
- July 04, 2020కరోనాతో గల్ఫ్ కంట్రీస్ లో చిక్కుకుపోయిన ప్రవాస భారతీయులను స్వదేశానికి తరలించేందుకు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే..స్వదేశానికి వస్తూ భారీగా బంగారంతో ఇండియాకి చేరుకున్న 14 మంది ప్రవాస భారతీయులు ఇండియన్ కస్టమ్స్ అధికారుల చేతికి చిక్కారు. 14 మంది నుంచి Dh7.7 మిలియన్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.రస్ అల్ ఖైమా నుంచి ఇండియా చేరుకున్న ముగ్గురు ప్రయాణికుల నుంచి 9.33 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ 45 లక్షలు. సౌదీ నుంచి వచ్చిన మరో 11 మంది నుంచి 22.652 కేజీల బంగారాన్ని పట్టుకున్నారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న బంగారం విలువ 11 కోట్ల వరకు ఉంటుందని అంచనా. విమానాశ్రయాల్లో కస్టమ్స్ అధికారులను తప్పించుకునేందుకు బంగారాన్ని ఎమర్జెన్సీ లైట్స్ లో అమర్చారు. అయితే..అనుమానం వచ్చిన అధికారులు తనిఖీలు చేయటంతో బంగారం అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
తాజా వార్తలు
- 175 కోట్ల నెక్లెస్ మెఘా సుధారెడ్డి షో
- ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు బెయిల్
- పోలింగ్ రోజు భారీ వర్ష సూచన..అభ్యర్థుల్లో టెన్షన్ టెన్షన్
- భారత యాత్రికులను స్వాగతించిన సౌదీ మంత్రి
- కారు మరమ్మతుల కోసం 2 నెలల నిరీక్షణ..!
- నకిలీ వస్తువుల విక్రయం కేసు.. వ్యాపారి నిర్దోషి
- బిగ్ టికెట్ రాఫిల్.. తదుపరి డ్రా జూన్ 3న
- నకిలీ వెబ్సైట్ల గురించి PACI హెచ్చరిక
- ఇండియాలో చిక్కుకుపోయిన ఒమన్ వాసులు..!
- రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న మెగాస్టార్ చిరంజీవి