తెలంగాణలో కొత్తగా 1,850 కరోనా కేసులు

- July 04, 2020 , by Maagulf
తెలంగాణలో కొత్తగా 1,850 కరోనా కేసులు

హైదరాబాద్:తెలంగాణలో శనివారం ఒక్కరోజే రాష్ట్రంలో 1,850పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 22, 312కు చేరింది.  శనివారం రాష్ట్రవ్యాప్తంగా  ఐదుగురు కరోనా మహమ్మారికి బలయ్యారు. దీంతో కరోనా కారణంగా ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 288కు చేరింది. కొత్తగా వచ్చిన కేసుల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే 1,572 నమోదయ్యాయి. మిగిలిన వాటిలో రంగారెడ్డిలో 92, మేడ్చల్‌ 53, వరంగల్‌ అర్బన్‌లో 31, కరీంనగర్‌లో 18 కేసులు నమోదయ్యాయి. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా 1,342 మంది కరోనా నుంచి కోలుకొని డిశార్జ్‌ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 10,487 యాక్టివ్‌ కేసుల ఉన్నాయి.

--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com