మస్కట్:విమానఛార్జీలను పెంచే ప్రసక్తే లేదు..స్పష్టం చేసిన ఒమన్ ప్రభుత్వం

- July 04, 2020 , by Maagulf
మస్కట్:విమానఛార్జీలను పెంచే ప్రసక్తే లేదు..స్పష్టం చేసిన ఒమన్ ప్రభుత్వం

మస్కట్:కరోనాతో ప్రస్తుతం సంక్షోభ పరిస్థితులను ఎదుర్కుంటున్నా..భవిష్యత్తులో విమాన ప్రయాణికులపై భారం వేసే ప్రసక్తే లేదని ఒమన్ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటించింది. విమాన ఛార్జీలను ఇప్పట్లో పెంచే ఆలోచన లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ప్రజలు కూడా ఆర్ధిక సమస్యలు ఎదుర్కుంటున్న విషయాన్ని పరిగణలోకి తీసుకుంటున్నామని...అందుకే విమాన ఛార్జీలను పెంచే ఆలోచన తమకు లేదని స్పష్టం చేసింది. అయితే..ఎదైనా ఒక గమ్య స్థానానికి ఒకే సంస్థ నుంచి మాత్రమే విమాన సర్వీసులు ఉంటే..విమాన ఛార్జీలను పౌర విమానయాన శాఖ నిర్ధారిస్తుందని తెలిపింది. ఇక ఒకే గమ్యస్థానానికి పలువురు ఆపరేటర్లు విమాన సర్వీసులను నడిపిస్తే పోటీ నెలకొంటుదని..అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఛార్జీలను నిర్ధారిస్తారని వివరించింది. అయితే..ప్రస్తుత పరిస్థితుల్లో భూమార్గం ద్వారాగానీ, ఆకాశమార్గం ద్వారాగానీ సరిహద్దులు దాటి వచ్చే వారిని ప్రొత్సహించేలా లేవని కూడా ఈ సందర్భంగా అభిప్రాయపడింది. ఇదిలాఉంటే..విదేశాల నుంచి ఒమన్ కు వచ్చే వారి కోసం ఫిబ్రవరి 1 నుంచి జూన్ 30 మధ్యకాలంలో దాదాపు 2,400 విమానాలు నడిపినట్లు పౌరవిమానయాన శాఖ వెల్లడించింది. ఒమన్ చేరుకున్న వారందర్ని కోవిడ్ మార్గదర్శకాల మేరకు నిర్బంధం చేశామని వివరించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com