మస్కట్:విమానఛార్జీలను పెంచే ప్రసక్తే లేదు..స్పష్టం చేసిన ఒమన్ ప్రభుత్వం
- July 04, 2020
మస్కట్:కరోనాతో ప్రస్తుతం సంక్షోభ పరిస్థితులను ఎదుర్కుంటున్నా..భవిష్యత్తులో విమాన ప్రయాణికులపై భారం వేసే ప్రసక్తే లేదని ఒమన్ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటించింది. విమాన ఛార్జీలను ఇప్పట్లో పెంచే ఆలోచన లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ప్రజలు కూడా ఆర్ధిక సమస్యలు ఎదుర్కుంటున్న విషయాన్ని పరిగణలోకి తీసుకుంటున్నామని...అందుకే విమాన ఛార్జీలను పెంచే ఆలోచన తమకు లేదని స్పష్టం చేసింది. అయితే..ఎదైనా ఒక గమ్య స్థానానికి ఒకే సంస్థ నుంచి మాత్రమే విమాన సర్వీసులు ఉంటే..విమాన ఛార్జీలను పౌర విమానయాన శాఖ నిర్ధారిస్తుందని తెలిపింది. ఇక ఒకే గమ్యస్థానానికి పలువురు ఆపరేటర్లు విమాన సర్వీసులను నడిపిస్తే పోటీ నెలకొంటుదని..అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఛార్జీలను నిర్ధారిస్తారని వివరించింది. అయితే..ప్రస్తుత పరిస్థితుల్లో భూమార్గం ద్వారాగానీ, ఆకాశమార్గం ద్వారాగానీ సరిహద్దులు దాటి వచ్చే వారిని ప్రొత్సహించేలా లేవని కూడా ఈ సందర్భంగా అభిప్రాయపడింది. ఇదిలాఉంటే..విదేశాల నుంచి ఒమన్ కు వచ్చే వారి కోసం ఫిబ్రవరి 1 నుంచి జూన్ 30 మధ్యకాలంలో దాదాపు 2,400 విమానాలు నడిపినట్లు పౌరవిమానయాన శాఖ వెల్లడించింది. ఒమన్ చేరుకున్న వారందర్ని కోవిడ్ మార్గదర్శకాల మేరకు నిర్బంధం చేశామని వివరించింది.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







