మస్కట్:విమానఛార్జీలను పెంచే ప్రసక్తే లేదు..స్పష్టం చేసిన ఒమన్ ప్రభుత్వం
- July 04, 2020
మస్కట్:కరోనాతో ప్రస్తుతం సంక్షోభ పరిస్థితులను ఎదుర్కుంటున్నా..భవిష్యత్తులో విమాన ప్రయాణికులపై భారం వేసే ప్రసక్తే లేదని ఒమన్ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటించింది. విమాన ఛార్జీలను ఇప్పట్లో పెంచే ఆలోచన లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ప్రజలు కూడా ఆర్ధిక సమస్యలు ఎదుర్కుంటున్న విషయాన్ని పరిగణలోకి తీసుకుంటున్నామని...అందుకే విమాన ఛార్జీలను పెంచే ఆలోచన తమకు లేదని స్పష్టం చేసింది. అయితే..ఎదైనా ఒక గమ్య స్థానానికి ఒకే సంస్థ నుంచి మాత్రమే విమాన సర్వీసులు ఉంటే..విమాన ఛార్జీలను పౌర విమానయాన శాఖ నిర్ధారిస్తుందని తెలిపింది. ఇక ఒకే గమ్యస్థానానికి పలువురు ఆపరేటర్లు విమాన సర్వీసులను నడిపిస్తే పోటీ నెలకొంటుదని..అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఛార్జీలను నిర్ధారిస్తారని వివరించింది. అయితే..ప్రస్తుత పరిస్థితుల్లో భూమార్గం ద్వారాగానీ, ఆకాశమార్గం ద్వారాగానీ సరిహద్దులు దాటి వచ్చే వారిని ప్రొత్సహించేలా లేవని కూడా ఈ సందర్భంగా అభిప్రాయపడింది. ఇదిలాఉంటే..విదేశాల నుంచి ఒమన్ కు వచ్చే వారి కోసం ఫిబ్రవరి 1 నుంచి జూన్ 30 మధ్యకాలంలో దాదాపు 2,400 విమానాలు నడిపినట్లు పౌరవిమానయాన శాఖ వెల్లడించింది. ఒమన్ చేరుకున్న వారందర్ని కోవిడ్ మార్గదర్శకాల మేరకు నిర్బంధం చేశామని వివరించింది.
తాజా వార్తలు
- మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న సోనూ సూద్..
- TTDకి అనంత్ అంబానీ 25 ఎలక్ట్రిక్ బస్సుల విరాళం
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..ఒక్కరికే Dh100,000 సొంతం..!!
- సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై ఖతార్ ఎయిర్వేస్ క్లారిటీ..!!
- లూలూలో భారీ టెక్ డీల్స్..‘లెట్స్ కనెక్ట్’ టెక్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- ICRF సమ్మర్ అవేర్నెస్..200 మంది కార్మికులకు ప్రయోజనం..!!
- విషాదం..సైనికుడి మృతికి యూఏఈ సంతాపం..!!
- ఒమన్ లో ప్లాస్టిక్ పై నిషేధం..జూలై 1 నుండి ఐదవ దశ ప్రారంభం..!!
- సముద్రయానం ముప్పు..సౌదీ, ఈజిప్ట్, ఖతార్ చర్చలు..!!
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక







