కోవిడ్-19: మూడో స్థానంలోకి భారత్ చేరే అవకాశం

- July 05, 2020 , by Maagulf
కోవిడ్-19: మూడో స్థానంలోకి భారత్ చేరే అవకాశం

భారత దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య 6 లక్షల 73 వేల 904 కు పెరిగింది. శనివారం, రికార్డు స్థాయిలో 24018 మందికి కరోనా సోకింది, అలాగే కొత్తగా 14 వేల 327 మంది కోలుకున్నారు. దాంతో డిశ్చార్జ్ అయినా వారి సంఖ్య 409,062 కు చేరింది. అలాగే మరణాల సంఖ్య 19,279 కు చేరింది. ఈ గణాంకాలు Covid19india.org ప్రకారం ఉన్నాయి, ఇక మహారాష్ట్రలో కొత్తగా 7074 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. దీంతో ఈ రాష్ట్రంలో 2 లక్షలకు పైగా రోగులు ఉన్నట్టయింది, అలాగే 8671 మంది మరణించారు.

మరోవైపు, భారతదేశం మరియు రష్యా మధ్య సంక్రమణల వ్యత్యాసం 611 మాత్రమే ఉంది. రోగుల పరంగా మూడవ స్థానంలో భారత్ ఇవాళ చేరుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం అమెరికా మొదటి స్థానంలో, బ్రెజిల్ రెండవ స్థానంలో ఉన్నాయి. ఈ రెండు దేశాల తరువాత, ప్రతిరోజూ అత్యధిక సంఖ్యలో కొత్త అంటువ్యాధులు భారత్ నుండి వస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com