కువైట్:ఆరోగ్య సిబ్బంది వారి రెసిడెన్సీ వీసా గడువు ముగిసినప్పటికీ తిరిగి రావచ్చు
- July 05, 2020కువైట్ సిటీ:వైద్య శాఖ స్పాన్సర్ షిప్ లో పని చేస్తున్న ప్రవాస వైద్యరంగ నిపుణుల్ని కువైట్ ప్రభుత్వం సాదరంగా అహ్వానిస్తోంది. రెసిడెన్సీ వీసా గడువు ముగిసినా సరే..హెల్త్ స్టాఫ్ కువైట్ రావొచ్చని స్పష్టమైన ప్రకటన చేసింది. వైద్య శాఖలో వివిధ విభాగాల్లో పని చేస్తున్న విదేశీ ఉద్యోగుల కరోనాకు ముందు వివిధ కారణాలతో వారి సొంత దేశాలకు వెళ్లారని కువైట్ వైద్య శాఖ వెల్లడించింది. అయితే..లాక్ డౌన్ మార్చిలో అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయిన విషయం తెలిసిందే. దీంతో వాళ్లంతా ఆయా దేశాల్లోనే ఉండిపోయారు. అలా దాదాపు 1000 మంది డాక్టర్లు, నర్సులు, రేడియాలజి టెక్నిషియన్లు కువైట్ రాలేకపోయారు. ఇందులో ఎక్కువ మంది భారతీయులే కావటం విశేషం. ప్రస్తుతం కరోనా పరిస్థితుల నేపథ్యంలో కువైట్ వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉండటంతో వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన హెల్త్ స్టాఫ్ కు కువైట్ అహ్వానం పలుకుతోంది. రెసిడెన్సీ వీసా గడువు ముగిసినా సరే వైద్య రంగ నిఫుణులు రావొచ్చని, అలాగే తమ వెంట కుటుంబసభ్యులను తీసుకొచ్చేందుకు అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..