ముహర్రఖ్ గవర్నరేట్ లో కార్మికుల నివాస వసతుల పరిశీలనకు విస్తృత తనిఖీలు
- July 05, 2020
బహ్రెయిన్:ముహర్రఖ్ గవర్నరేట్ పరిధిలో ప్రవాస కార్మికులు ఉంటున్న నివాస గదులను ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నారు అధికారులు. కరోనా నేపథ్యంలో కార్మికులు ఆరోగ్య సంరక్షణకు ఈ తనిఖీలు చేపడుతున్నారు. గతంలో ఇరుకిరుకు గదుల్లోనే ఎక్కువ మంది కార్మికులకు ఉంచేవారు. అయితే..కరోనా వ్యాప్తితో గదిలో పరిమిత సంఖ్యలోనే కార్మికులకు బస కల్పించాలని బహ్రెయిన్ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ముహర్రఖ్ గవర్నరేట్ పరిధిలోని పాలకులు..కార్మికుల వసతి సౌకర్యాలను ఎప్పటికప్పుడు మానిటర్ చేసేందుకు శాశ్వత కమిటిని నియమించారు. ఈ కమిటి ఎప్పుటికప్పుడు తనిఖీలు చేపడుతూ కార్మికుల వసతులను పరిశీలిస్తున్నారు. అంతేకాదు..అంతర్గత మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా అవసరమైన సమయాల్లో కార్మికులకు అహారంతో పాటు అత్యవసర వస్తువులను అందిస్తున్నారు. రాయల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మానవతా ధృక్పథంతో కార్మికులు సాయం అందిస్తున్నట్లు కమిటి సభ్యులు వివరించారు.
తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







