ముహర్రఖ్ గవర్నరేట్ లో కార్మికుల నివాస వసతుల పరిశీలనకు విస్తృత తనిఖీలు
- July 05, 2020
బహ్రెయిన్:ముహర్రఖ్ గవర్నరేట్ పరిధిలో ప్రవాస కార్మికులు ఉంటున్న నివాస గదులను ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నారు అధికారులు. కరోనా నేపథ్యంలో కార్మికులు ఆరోగ్య సంరక్షణకు ఈ తనిఖీలు చేపడుతున్నారు. గతంలో ఇరుకిరుకు గదుల్లోనే ఎక్కువ మంది కార్మికులకు ఉంచేవారు. అయితే..కరోనా వ్యాప్తితో గదిలో పరిమిత సంఖ్యలోనే కార్మికులకు బస కల్పించాలని బహ్రెయిన్ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ముహర్రఖ్ గవర్నరేట్ పరిధిలోని పాలకులు..కార్మికుల వసతి సౌకర్యాలను ఎప్పటికప్పుడు మానిటర్ చేసేందుకు శాశ్వత కమిటిని నియమించారు. ఈ కమిటి ఎప్పుటికప్పుడు తనిఖీలు చేపడుతూ కార్మికుల వసతులను పరిశీలిస్తున్నారు. అంతేకాదు..అంతర్గత మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా అవసరమైన సమయాల్లో కార్మికులకు అహారంతో పాటు అత్యవసర వస్తువులను అందిస్తున్నారు. రాయల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మానవతా ధృక్పథంతో కార్మికులు సాయం అందిస్తున్నట్లు కమిటి సభ్యులు వివరించారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు