తెలంగాణలో 11 కరోనా మరణాలు
- July 06, 2020
హైదరాబాద్:తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత వారంగా ఈ సంఖ్య మరింత తీవ్రమైంది.సోమవారం ఒక్కరోజే 1,831 కేసులు నమోదు కాగా 11 మృతి చెందారు. ఇప్పటివరకూ అన్ని జిల్లాల్లో 25,733 మంది కరోనా బారిన పడ్డారు.మొత్తం 306 మంది చనిపోయారు.ఇంకా 10,646 కేసులు యాక్టివ్ ఉన్నాయి.కరోనా సోకి చికిత్స పొంది తాజాగా 2,078 మంది డిశ్చార్జి కాగా ఇప్పటివరకూ 14,781 మంది డిశ్చార్జి అయ్యారు.
GHMC పరిధిలోనే 1,419 మందికి పాజిటివ్ రాగా రంగారెడ్డి జిల్లాలో 160, మేడ్చల్ జిల్లాలో 117, సంగారెడ్డిలో 3, కరీంనగర్లో 5,మహబూబ్ నగర్లో 9, గద్వాల్లో 1, నల్గొండలో 9, వరంగల్ అర్బన్లో 9, నిజామాబాద్ లో 9, వికారాబాద్లో 7,మెదక్లో 20, నారాయణపేట్లో 1, పెద్దపల్లిలో 9, యాదాద్రిలో 1, సూర్యాపేటలో 6, మంచిర్యాలలో 20, ఖమ్మంలో 20, జగిత్యాలలో 4, మహబూబాబాద్లో ఒక్క కేసు నమోదు అయినట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ వెల్లండించింది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







