దుబాయ్:అవినీతికి పాల్పడిన ప్రభుత్వ అధికారి అరెస్ట్
- July 07, 2020
దుబాయ్:అంతర్గత మంత్రిత్వ శాఖలో విధులు నిర్వహిస్తూ అవినీతికి పాల్పడిన ఓ ప్రభుత్వ అధికారిని, అతని సహచరులను యూఏఈ పోలీసులు అరెస్ట్ చేశారు. వాంటెడ్ జాబితాలో మీ పేర్లను చేరుస్తామంటూ అమాయకులను బెదిరిస్తూ వారిని బ్లాక్ మెయిల్ చేస్తున్న కేసులో గవర్నమెంట్ అధికారిని అరెస్ట్ చేసినట్లు మంత్రిత్వ శాఖ తమ ట్విట్టర్ అకౌంట్లో ట్వీట్ చేసింది. యూఏఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతిని ఉపేక్షించబోదని ఈ సందర్భంగా అంతర్గత మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. తమ సమాజంలో అవినీతి, మోసాలకు తావు లేదని, ముఖ్యంగా జాతికి, సమాజానికి సేవ చేసే ప్రభుత్వ సంస్థల్లో అవినీతిని అస్సలు సహించబోమని హెచ్చరించింది. ఇది తమ వ్యవస్థాగత సిద్ధాంతాలకు పూర్తిగా విరుద్ధమని వెల్లడించింది. అరెస్ట్ చేసిన ప్రభుత్వ అధికారితో పాటు అతని సహచరులను జ్యూడిషియరి అధికారులకు అప్పగించిట్లు తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







