దుబాయ్:అవినీతికి పాల్పడిన ప్రభుత్వ అధికారి అరెస్ట్
- July 07, 2020 
            దుబాయ్:అంతర్గత మంత్రిత్వ శాఖలో విధులు నిర్వహిస్తూ అవినీతికి పాల్పడిన ఓ ప్రభుత్వ అధికారిని, అతని సహచరులను యూఏఈ పోలీసులు అరెస్ట్ చేశారు. వాంటెడ్ జాబితాలో మీ పేర్లను చేరుస్తామంటూ అమాయకులను బెదిరిస్తూ వారిని బ్లాక్ మెయిల్ చేస్తున్న కేసులో గవర్నమెంట్ అధికారిని అరెస్ట్ చేసినట్లు మంత్రిత్వ శాఖ తమ ట్విట్టర్ అకౌంట్లో ట్వీట్ చేసింది. యూఏఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతిని ఉపేక్షించబోదని ఈ సందర్భంగా అంతర్గత మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. తమ సమాజంలో అవినీతి, మోసాలకు తావు లేదని, ముఖ్యంగా జాతికి, సమాజానికి సేవ చేసే ప్రభుత్వ సంస్థల్లో అవినీతిని అస్సలు సహించబోమని హెచ్చరించింది. ఇది తమ వ్యవస్థాగత సిద్ధాంతాలకు పూర్తిగా విరుద్ధమని వెల్లడించింది. అరెస్ట్ చేసిన ప్రభుత్వ అధికారితో పాటు అతని సహచరులను జ్యూడిషియరి అధికారులకు అప్పగించిట్లు తెలిపింది.
తాజా వార్తలు
- Women’s World Cup 2025: ఫైనల్ చేరిన భారత్
- ప్రతి నెలా జాబ్ మేళాలు నిర్వహించాలి: సీఎం చంద్రబాబు
- 2,790 మంది భారతీయులను US వెనక్కి పంపింది: కేంద్రం
- యూఏఈలోని భారతీయ ప్రవాసులకు ఇక ఇ-పాస్పోర్టులే..!!
- ఉమ్రా వీసా వ్యాలిడిటీని తగ్గించిన సౌదీ అరేబియా..!!
- దోఫర్ మునిసిపాలిటీలో విస్తృతంగా తనిఖీలు..!!
- అల్-జహ్రా నేచర్ రిజర్వ్ నవంబర్ 9న రీ ఓపెన్..!!
- మీ ID, మీ గోప్యత.. బహ్రెయిన్ లో డెలివరీలకు న్యూ గైడ్ లైన్స్..!!
- ఖతార్ లో నవంబర్ 4న రిమోట్ క్లాసెస్..!!
- నాట్స్ విస్తరణలో మరో ముందడుగు షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్







