భారత్ లో 20,000 దాటిన కరోనా మరణాలు

- July 07, 2020 , by Maagulf
భారత్ లో 20,000 దాటిన కరోనా మరణాలు

భారత దేశవ్యాప్తంగా గత 24 గంటలలో 22,252 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 7,19,665కు చేరిందని కేంద్ర వైద్యారోగ్య శాఖ వెబ్ సైట్ మంగళవారం పేర్కొంది. అలాగే కరోనా బారిన పడి కొత్తగా 467 మంది మరణించారని తెలిపింది. దీంతో కరోనా సోకి దేశవ్యాప్తంగా

ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 20,160కు చేరింది. ఇప్పటివరకూ 4,39,947 మంది కోవిడ్‌ నుంచి కోలుకున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా 2,59,557 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక 24 గంటలలో దేశ వ్యాప్తంగా 2,41,430 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు జరిగాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 1,02,11,092 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు జరిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com