మస్కట్:ఇక నుంచి ఆన్ లైన్ లో కూడా డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్
- July 08, 2020
మస్కట్:డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ కోసం ఇక నుంచి ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక నుంచి ఆన్ లైన్ లో కూడా డ్రైవింగ్ లైసెన్స్ ను రెన్యూవల్ చేసుకోవచ్చని రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించారు. ఈ నెల 12 నుంచి ఈ-రెన్యూవల్ విధానం అమలులోకి రానుంది. దేశ పౌరులు, ప్రవాసీయులు అంతా ఈ వెసులుబాటును వినియోగించుకోవాలని కోరారు. పోలీస్ వెబ్ సైట్ ద్వారాగానీ, లేదంటే స్మార్ట్ ఫోన్ లోని పోలీస్ యాప్ ద్వారాగానీ డ్రైవింగ్ లెసెన్స్ రెన్యూవల్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. కంటి నమూనాలకు సంబంధించి ఎలక్ట్రానిక్ ద్వారానే సమాచారాన్ని సేకరించి దాన్ని క్రోడికించుకొని లైసెన్స్ రెన్యూవల్ చేసయనున్నట్లు అధికారులు వివరించారు. రెన్యూవల్ చేసుకున్న లైసెన్స్ ను తమ గవర్నరేట్ పరిధిలోని సమీప పోలీస్ స్టేషన్ నుంచి తీసుకొచ్చని రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- బహ్రెయిన్-భారత్ చర్చలు..వాణిజ్యం, భద్రత మరియు ప్రాంతీయ శాంతిపై దృష్టి..!!
- బిగ్ టికెట్ డ్రాలో Dh25 మిలియన్ల గ్రాండ్ ప్రైజ్ను గెలుచుకున్న భారతీయ ప్రవాసుడు..!!
- యూనిఫైడ్ GCC వీసాపై క్లారిటీ ఇచ్చిన సౌదీ పర్యాటక మంత్రి..!!
- కువైట్ రైల్వే ప్రాజెక్ట్.. రైల్వే స్టేషన్ మొదటి దశ పూర్తి..!!
- సముద్ర కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసిన ఖతార్..!!
- ఒమన్ చోరీ కేసులలో పలువురి అరెస్టు..!!
- తెలంగాణ: బస్సులో సీటు దొరకట్లేదన్న దిగులు వద్దు..
- బ్రిటన్లో ఆరోగ్య రంగంలో నారాయణ హెల్త్ పెద్ద అడుగు!
- ఏపీకి పెట్టుబడుల వెల్లువ..
- ఎలక్ట్రిక్ యుగం వైపు ఏపీ—హిందూజా భాగస్వామ్యం!







