కర్ఫ్యూ నుంచి మినహాయింపునకు ఆస్పత్రి వెళ్లిన ఆధారాలు తప్పనిసరి చేసిన కువైట్
- July 08, 2020కువైట్ సిటీ:ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు కర్ఫ్యూ సమయంలో ఆస్పత్రికి వెళ్లాలంటే అనుమతి తప్పనిసరిగా ఉండాలని ప్రకటించింది కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ. కర్ఫ్యూ నుంచి మినహాయింపు పొందెందుకు వారు వెళ్తున్న ఆస్పత్రి, హెల్త్ సెంటర్ వివరాలను తప్పనిసరిగా తమ దరఖాస్తులో తెలుపాల్సి ఉంటుంది. దరఖాస్తుల కోసం మంత్రిత్వ శాఖ ఓ ప్రత్యేక వెబ్ సైట్ ను కూడా ప్రారంభించింది. https://curfew.paci.gov.kw ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు..అనుమతి పొందిన వ్యక్తులు...తాము ఆస్పత్రి, హెల్త్ సెంటర్ లో విజిట్ చేసిన తర్వాత చికిత్స వివరాలను కూడా వెబ్ సైట్ లో ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయాలి. ఇలా అప్ డేట్ చేయటం ద్వారా భవిష్యత్తులో కూడా కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంటుంది. ఆస్పత్రికి వెళ్లిన వివరాలను నమోదు చేయకుంటే కర్ఫ్యూ నుంచి మినహాయింపు రద్దు అవుతుంది.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు