అబుధాబిలో పాస్ పోర్ట్ రెన్యూవల్ సేవలు పున:ప్రారంభం..
- July 09, 2020అబుధాబి:కరోనా ఎఫెక్ట్ తో గత మార్చి నుంచి నిలిచిపోయిన పాస్ పోర్ట్ రెన్యూవల్ సేవలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు అబుధాబిలోని భారత రాయబారి కార్యాలయం ప్రకటించింది. పాస్ పోర్ట్ సేవలపై ఇప్పటివరకు ఉన్న అన్ని ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు వెల్లడించింది. ఈ నెల 15 నుంచి అబుధాబిలోని అన్ని బీఎల్ఎస్ కేంద్రాల్లో పాస్ పోర్ట్ రెన్యూవల్ సేవలు అందుబాటులోకి వస్తాయని రాయబార కార్యాలయ అధికారులు స్పష్టం చేశారు. అయితే..60 ఏళ్లు దాటిన వృద్ధులు, 12 ఏళ్లలోపు పిల్లలు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు పాస్ పోర్ట్ రెన్యూవల్ కోసం వ్యక్తిగతంగా హజరుకావాల్సిన అవసరం లేదన్నారు. ఇక ఆఫీసుకు హజరయ్యేవారు మాత్రం ఖచ్చితంగా కరోనా వ్యాప్తి నియంత్రణ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలన్నారు. ప్రతి ఒక్కరు ఫేస్ మాస్క్, హ్యాండ్ గ్లౌజ్ ధరించాలని..భౌతిక దూరం పాటించాలని సూచించారు.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?