కువైటేజేషన్ ఎఫెక్ట్..ఈ ఏడాది చివరి నాటికి స్వదేశాలకు 15 లక్షల మంది ప్రవాసీయులు
- July 10, 2020
కువైట్ సిటీ:కరోనా కల్లోలం, కువైటేజేషన్ పాలసీతో ఈ ఏడాది చివరి నాటికి కువైట్ లోని ప్రవాసీయులు భారీ సంఖ్యలో దేశం విడిచి తమ స్వదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. దాదాపు 15 లక్షల మంది ప్రవాసీయులు కువైట్ వదిలి వెళ్లొచ్చని భావిస్తున్నారు. కరోనా సంక్షోభంతో ఇప్పటికే 1,58,031 మంది ప్రవాసీయులు దేశం విడిచి వెళ్లినట్లు కువైట్ ప్రకటించింది. ఇందులో భారతీయులు, ఈజిప్టియన్లే ఎక్కువ మంది ఉన్నారు. మార్చి 16 నుంచి జులై 9 వరకు అంటే ఈ 116 రోజుల్లోనే కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా దాదాపు 993 ఫ్లైట్స్ ప్రవాసీయులను వారి సొంత దేశాలకు తరలించాయి. అయితే..ప్రస్తుతానికి తమ పూర్తిస్థాయి సామర్ధ్యంలో కేవలం 15 శాతం విమానాలను మాత్రమే కువైట్ ఎయిర్ పోర్ట్ ద్వారా ఆపరేట్ అవుతున్నాయి. వచ్చే నెలలో పూర్తి స్థాయిలో విమానాలను ఆపరేట్ చేసే అవకాశాలు ఉండటంతో రెట్టింపు సంఖ్యలో ప్రవాసీయులు తిరిగి వెళ్లిపోతారని కువైట్ అంచనా వేస్తోంది. దీనికితోడు కరోనా సంక్షోభంతో చాలా వరకు ప్రైవేట్ సంస్థలు తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అదే సమయంలో కువైట్ జనాభా సమతుల్యత లక్ష్యంగా ముసాయిదా తీర్మానం అమలులోకి రాబోతుండటంతో ఈ ఏడాది చివరి నాటికి 15 లక్షల మంది ప్రవాసీయులు దేశం విడిచి వెళ్లనున్నారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







