కువైటేజేషన్ ఎఫెక్ట్..ఈ ఏడాది చివరి నాటికి స్వదేశాలకు 15 లక్షల మంది ప్రవాసీయులు
- July 10, 2020
కువైట్ సిటీ:కరోనా కల్లోలం, కువైటేజేషన్ పాలసీతో ఈ ఏడాది చివరి నాటికి కువైట్ లోని ప్రవాసీయులు భారీ సంఖ్యలో దేశం విడిచి తమ స్వదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. దాదాపు 15 లక్షల మంది ప్రవాసీయులు కువైట్ వదిలి వెళ్లొచ్చని భావిస్తున్నారు. కరోనా సంక్షోభంతో ఇప్పటికే 1,58,031 మంది ప్రవాసీయులు దేశం విడిచి వెళ్లినట్లు కువైట్ ప్రకటించింది. ఇందులో భారతీయులు, ఈజిప్టియన్లే ఎక్కువ మంది ఉన్నారు. మార్చి 16 నుంచి జులై 9 వరకు అంటే ఈ 116 రోజుల్లోనే కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా దాదాపు 993 ఫ్లైట్స్ ప్రవాసీయులను వారి సొంత దేశాలకు తరలించాయి. అయితే..ప్రస్తుతానికి తమ పూర్తిస్థాయి సామర్ధ్యంలో కేవలం 15 శాతం విమానాలను మాత్రమే కువైట్ ఎయిర్ పోర్ట్ ద్వారా ఆపరేట్ అవుతున్నాయి. వచ్చే నెలలో పూర్తి స్థాయిలో విమానాలను ఆపరేట్ చేసే అవకాశాలు ఉండటంతో రెట్టింపు సంఖ్యలో ప్రవాసీయులు తిరిగి వెళ్లిపోతారని కువైట్ అంచనా వేస్తోంది. దీనికితోడు కరోనా సంక్షోభంతో చాలా వరకు ప్రైవేట్ సంస్థలు తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అదే సమయంలో కువైట్ జనాభా సమతుల్యత లక్ష్యంగా ముసాయిదా తీర్మానం అమలులోకి రాబోతుండటంతో ఈ ఏడాది చివరి నాటికి 15 లక్షల మంది ప్రవాసీయులు దేశం విడిచి వెళ్లనున్నారు.
తాజా వార్తలు
- ఈ నెల జూన్ 24, 25 తేదీల్లో 11వ ఇంటర్నేషనల్ పోలీస్ ఎక్స్పో
- రామోజీ ఫిల్మ్సిటీలో టీజీ20 లీగ్ వేలం షురూ
- వనపర్తిలో అంబులెన్స్ ప్రారంభం..నిరుపేదలకు ఉచిత ఆటోలు పంపిణీ చేసిన సోనుసూద్
- 100 రోజులు.. స్థిరత్వాన్ని కాపాడుకున్న గల్ఫ్ దేశాలు..!!
- ప్రపంచవ్యాప్తంగా హ్యుమటేరియన్ సేవల్లో కువైట్ ఛారిటీస్..!!
- యూఏఈ లాటరీ డ్రా..ఒక్కొక్కరు Dh50,000 గెలుచుకున్నముగ్గురు విజేతలు..!!
- ఆన్లైన్ పర్యాటక మోసాలపై సౌదీ ఎంబసీ హెచ్చరిక..!!
- మహిళను సురక్షితంగా తరలించిన ఆర్ఓపి ఏవియేషన్..!!
- భారతీయ మహిళకు అండగా నిలిచిన ఇండియన్ ఎంబసీ..!!
- 'మీ సురక్ష–కలిసి ఉంటే కలదు సుఖం' కార్యక్రమం ఘనంగా నిర్వహణ









