కరోనా కేసుల్లో రికార్డ్ కొడుతున్న భారత్

- July 12, 2020 , by Maagulf
కరోనా కేసుల్లో రికార్డ్ కొడుతున్న భారత్

దేశంలో కరోనా వైరస్ సామూహిక వ్యాప్తి లేదని కేంద్రం, వైద్య వర్గాలు గట్టిగా చెబుతున్నప్పటికీ.. కొత్త కేసులు భారీగా బయటపడుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతున్నది. కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం వెల్లడించిన లెక్కల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 28,637 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇది మరో రికార్డు. ఆదివారం నాటి కేసులతో కలిపి, భారత్ లో మొత్తం కేసుల సంఖ్య 8.5లక్షలకు పెరిగింది. కరోనాకు మోస్ట్ ఎఫెక్ట్ అయిన దేశాల జాబితాలో మనం అమెరికా(33.55లక్షల కేసులు), బ్రెజిల్(18లక్షల కేసులు) తర్వాత మూడో స్థానంలో కొనసాగుతున్నాం.

కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం దాకా కరోనా కాటుకు గురై 551 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 22,674కు పెరిగింది. కాగా, భారత్ లో కొత్త కేసులతోపాటు రికవరీ రేటు గణనీయంగా ఉండం ఊరటకలిగిస్తున్నది. ఇప్పటిదాకా 62.78 శాతం రికవరీ రేటుతో 5.34లక్షల మంది కొవిడ్ వ్యాధి నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 3లక్షలకు దగ్గరగా ఉంది. మోస్ట్ ఎఫెక్టెడ్ రాష్ట్రంగా ఉన్న మహారాష్ట్రలో కొవిడ్ మరణాల సంఖ్య 10వేల మార్కు దాటడం విషాదకరం. అక్కడ మొత్తం 2.46లక్షల కేసులు నమోదుకాగా, ఇప్పివరకు 10,116 మంది ప్రాణాలు కోల్పోయారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com