హైదరాబాద్ లో కరోనా హైరిస్క్ ప్రాంతాలు
- July 13, 2020హైదరాబాద్:కొన్ని రోజుల క్రితం వరకు హైదరాబాద్ లో కరోనా కేసులు రోజుకు వెయ్యికి పైగా నమోదవుతూ వచ్చాయి.అయితే, రెండు రోజులుగా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తున్నది.కేసులు తగ్గుముఖం పడుతున్నా,తీవ్రత నగరంలో ఎక్కువగా ఉండటంతో వైద్యశాఖాధికారులు నగరంపై దృష్టి పెట్టారు.500 కేసుల కంటే అధికంగా నమోదైన ప్రాంతాలను హైరిస్క్ ప్రాంతాలుగా గుర్తించారు.నగరంలో ఇలాంటి హైరిస్క్ ప్రాంతాలు 8 ఉన్నట్టు అధికారులు గుర్తించారు.యూసఫ్ గూడ, అంబర్ పేట, మెహదీపట్నం, కార్వాన్, చాంద్రాయణ గుట్ట, చార్మినార్, కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్ సర్కిళ్లను హైరిస్క్ జోన్ ప్రాంతాలుగా గుర్తించారు.ఈ ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేయాలని GHMC భావిస్తోంది.ఒక్కో హైరిస్క్ ప్రాంతంలో కేసుల నమోదును దృష్టిలో ఉంచుకొని 10 నుంచి 20 వరకు మొత్తంగా 8 ప్రాంతాల్లో 100 వరకు కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసేందుకు GHMC రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు