హైదరాబాద్ లో కరోనా హైరిస్క్ ప్రాంతాలు
- July 13, 2020
హైదరాబాద్:కొన్ని రోజుల క్రితం వరకు హైదరాబాద్ లో కరోనా కేసులు రోజుకు వెయ్యికి పైగా నమోదవుతూ వచ్చాయి.అయితే, రెండు రోజులుగా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తున్నది.కేసులు తగ్గుముఖం పడుతున్నా,తీవ్రత నగరంలో ఎక్కువగా ఉండటంతో వైద్యశాఖాధికారులు నగరంపై దృష్టి పెట్టారు.500 కేసుల కంటే అధికంగా నమోదైన ప్రాంతాలను హైరిస్క్ ప్రాంతాలుగా గుర్తించారు.నగరంలో ఇలాంటి హైరిస్క్ ప్రాంతాలు 8 ఉన్నట్టు అధికారులు గుర్తించారు.యూసఫ్ గూడ, అంబర్ పేట, మెహదీపట్నం, కార్వాన్, చాంద్రాయణ గుట్ట, చార్మినార్, కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్ సర్కిళ్లను హైరిస్క్ జోన్ ప్రాంతాలుగా గుర్తించారు.ఈ ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేయాలని GHMC భావిస్తోంది.ఒక్కో హైరిస్క్ ప్రాంతంలో కేసుల నమోదును దృష్టిలో ఉంచుకొని 10 నుంచి 20 వరకు మొత్తంగా 8 ప్రాంతాల్లో 100 వరకు కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసేందుకు GHMC రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..







