కువైట్:ఫర్వానియాలో లాక్ డౌన్ పై యథాతధస్థితి
- July 14, 2020
కువైట్ సిటీ:దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత, వైరస్ వ్యాప్తి నివారణ చర్యలపై చర్చించేందుకు ప్రధాని ఆధ్వర్యంలో మంత్రిమండలి సమావేశం అయ్యింది. ఈ సమావేశంలో వైరస్ ప్రభావంపై తాజా స్థితిగతులను, వైరస్ బారిన పడుతున్న సంఖ్య, వ్యాధి నుంచి కోలుకుంటున్న వారి గణాంకాల వివరాలను ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంత్రిమండలికి వివరించింది. అలాగే ఈద్ అల్ అధా రోజుల్లో వైరస్ ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా మంత్రిమండలి చర్చించింది. అయితే..లాక్ డౌన్ తర్వాత దశల వారిగా సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు చేపడుతున్న చర్యలపై ఈ వారపు భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పాక్షిక కర్ఫ్యూలో మరికొన్ని సడలింపులు ఉంటాయని భావించినా..ఆ దిశగా మంత్రిమండలి ఎలాంటి ప్రకటన చేయలేదు. అలాగే ఫర్వానియాలో లాక్ డౌన్ సడలింపులపై కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వచ్చే వారం సమావేశంలో ఈ అంశాలపై చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అప్పటివరకు ఫర్వానియాలో యథాతధ స్థితి కొనసాగనుంది.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం