కువైట్:ఫర్వానియాలో లాక్ డౌన్ పై యథాతధస్థితి
- July 14, 2020
కువైట్ సిటీ:దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత, వైరస్ వ్యాప్తి నివారణ చర్యలపై చర్చించేందుకు ప్రధాని ఆధ్వర్యంలో మంత్రిమండలి సమావేశం అయ్యింది. ఈ సమావేశంలో వైరస్ ప్రభావంపై తాజా స్థితిగతులను, వైరస్ బారిన పడుతున్న సంఖ్య, వ్యాధి నుంచి కోలుకుంటున్న వారి గణాంకాల వివరాలను ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంత్రిమండలికి వివరించింది. అలాగే ఈద్ అల్ అధా రోజుల్లో వైరస్ ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా మంత్రిమండలి చర్చించింది. అయితే..లాక్ డౌన్ తర్వాత దశల వారిగా సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు చేపడుతున్న చర్యలపై ఈ వారపు భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పాక్షిక కర్ఫ్యూలో మరికొన్ని సడలింపులు ఉంటాయని భావించినా..ఆ దిశగా మంత్రిమండలి ఎలాంటి ప్రకటన చేయలేదు. అలాగే ఫర్వానియాలో లాక్ డౌన్ సడలింపులపై కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వచ్చే వారం సమావేశంలో ఈ అంశాలపై చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అప్పటివరకు ఫర్వానియాలో యథాతధ స్థితి కొనసాగనుంది.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







