అనుమతి లేకుండా ఫండ్స్ కలెక్ట్ చేయటం నేరమని ప్రకటించిన ఓమన్

- July 15, 2020 , by Maagulf
అనుమతి లేకుండా ఫండ్స్ కలెక్ట్ చేయటం నేరమని ప్రకటించిన ఓమన్

మస్కట్:కుటుంబం దీన స్థితిలో ఉందని, తాము కష్టాలు అనుభవిస్తున్నామని జాలి క్రియేట్ చేస్తూ ఫండ్స్ వసూలు చేయటం తమ దేశంలో చట్టరిత్యా నేరమని ప్రకటించింది ఓమన్ ప్రభుత్వం. ఫోటోలు, వీడియోలు చూపిస్తూ సాయం కోరటాన్ని నేరంగా పరిగణిస్తామని గుర్తు చేసింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇటీవలి కాలంలో ఫండ్స్ రైజింగ్ కాన్సెప్టులు పెరుగుతున్న నేపథ్యంలో ఓమన్ ప్రభుత్వం ఈ హెచ్చరికలు జారీ చేసింది. నిజంగా ఎవరికైనా సాయం అవసరమై ఉంటే..వారు ఫండ్స్ వసూలు చేయటానికి తప్పనిసరిగా సంబంధిత మినిస్ట్రి నుంచి అనుమతి పొందాల్సి ఉంటుందని వివరించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com