నకిలీ ఎస్ఎంఎస్ లతో మోసం..రియాద్ లో పాకిస్తాన్ గ్యాంగ్ అరెస్ట్
- July 15, 2020
రియాద్:నకిలీ ఎస్ఎంఎస్ లతో అమాయకులను మోసం చేస్తున్న ముఠా గుట్టు రట్టైంది. మీరు క్యాష్ ప్రైజ్ గెలుచుకున్నారు..మీ బ్యాంక్ వివరాలు పంపించండి..మీ ఖాతాలో డబ్బులు జమ చేస్తాం అంటూ ఎస్ఎంఎస్ పంపిస్తారు. నమ్మి బ్యాంకు ఖాతా వివరాలు పంపించిన వారి అకౌంట్లో డబ్బు కాజేస్తారు. అంతేకాదు మీకు ప్రీ అప్రూవల్ లోన్ మీ కోసం సిద్ధంగా ఉంది..మీ డిటేల్స్ ఇవ్వండి..డబ్బు అకౌంట్లో క్రెడిట్ అవుతుందని, ఇంకా కొన్ని సార్లు మీరు తక్షణమే మా ఎస్ఎంఎస్ కు స్పందించకుంటే మీ బ్యాంక్ కార్డులు బ్లాక్ అవుతాయని ఇలా అయోమయానికి గురి చేసి వారి బ్యాంకు వివరాలను సేకరించి డబ్బు కాజేయం ఈ ముఠా పని. కాజేసిన సొమ్మును పాకిస్తాన్ లోని తమ బ్యాంకు అకౌంట్లోకి బదిలీ చేస్తుంటారు. ఇలా మోసం చేస్తున్న 8 మంది సభ్యులున్న పాకిస్తాన్ ముఠాను రియాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి SR 25,000, ఏటీఎం కార్డులు, 37 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







