నకిలీ ఎస్ఎంఎస్ లతో మోసం..రియాద్ లో పాకిస్తాన్ గ్యాంగ్ అరెస్ట్
- July 15, 2020
రియాద్:నకిలీ ఎస్ఎంఎస్ లతో అమాయకులను మోసం చేస్తున్న ముఠా గుట్టు రట్టైంది. మీరు క్యాష్ ప్రైజ్ గెలుచుకున్నారు..మీ బ్యాంక్ వివరాలు పంపించండి..మీ ఖాతాలో డబ్బులు జమ చేస్తాం అంటూ ఎస్ఎంఎస్ పంపిస్తారు. నమ్మి బ్యాంకు ఖాతా వివరాలు పంపించిన వారి అకౌంట్లో డబ్బు కాజేస్తారు. అంతేకాదు మీకు ప్రీ అప్రూవల్ లోన్ మీ కోసం సిద్ధంగా ఉంది..మీ డిటేల్స్ ఇవ్వండి..డబ్బు అకౌంట్లో క్రెడిట్ అవుతుందని, ఇంకా కొన్ని సార్లు మీరు తక్షణమే మా ఎస్ఎంఎస్ కు స్పందించకుంటే మీ బ్యాంక్ కార్డులు బ్లాక్ అవుతాయని ఇలా అయోమయానికి గురి చేసి వారి బ్యాంకు వివరాలను సేకరించి డబ్బు కాజేయం ఈ ముఠా పని. కాజేసిన సొమ్మును పాకిస్తాన్ లోని తమ బ్యాంకు అకౌంట్లోకి బదిలీ చేస్తుంటారు. ఇలా మోసం చేస్తున్న 8 మంది సభ్యులున్న పాకిస్తాన్ ముఠాను రియాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి SR 25,000, ఏటీఎం కార్డులు, 37 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్లెస్ రవాణాకు కొత్త ఊపు..!!







