తెలంగాణలో కొత్తగా 1,524 కరోనా పాజిటివ్ కేసులు

- July 14, 2020 , by Maagulf
తెలంగాణలో కొత్తగా 1,524 కరోనా పాజిటివ్ కేసులు

హైదరాబాద్:తెలంగాణలో గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1,524 కరోనా  పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 37,745కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. నేడు కరోనాతో మరో 10 మంది మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 375కి చేరింది. తాజాగా కరోనా నుంచి కోలుకున్న 1,161 మంది డిశ్చార్జి కావడంతో.. ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 24, 840కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 12,531 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కొత్తగా నమోదైన కేసుల్లో కేవలం GHMC పరిధిలోనే 815 ఉన్నాయి.

--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com