తెలంగాణలో కరోనాకు ఉచిత చికిత్స...
- July 15, 2020
హైదరాబాద్:తెలంగాణలో రోజురోజూకీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.కరోనా వైరస్కు కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చికిత్స అందించారు. కానీ పాజిటివ్ కేసులు పెరుగుతుండడం.. కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలనుకునే వారి సంఖ్య పెరగడంతో ప్రైవేటు ఆస్పత్రులకు అనుమతిలిచ్చారు. దీంతో అధిక శాతం మంది ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేటుకు పరుగులు తీస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రైవేటు ఆస్పత్రుల్లో నిర్వహించే కరోనా నిర్ధారణ పరీక్షలు, కరోనా చికిత్సకు వేసే బిల్లుల పట్ల తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. దీనికితోడు పాజిటివ్ కేసులు పల్లెల్లోకి పాకిపోవడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే చికిత్స అందిస్తున్న ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ కరోనా నిర్ధారణ పరీక్షలు, కరోనా చికిత్స ఉచితంగా అందించేందుకు నిర్ణయించారు. అందులో భాగంగానే ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు, చికిత్స ఉచితంగా అందించాలని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
అందుకోసం మొదటగా 3 ప్రైవేటు మెడికల్ కాలేజీలను ఎంపిక చేశారు. మల్లారెడ్డి మెడికల్ కాలేజీ, మమతా మెడికల్ కాలేజీ, కామినేని మెడికల్ కాలేజీల్లో కరోనా పరీక్షలు, కరోనా చికిత్స ఉచితంగా అందించేందుకు ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి విధివిధానాలను ఇంకా ప్రకటించాల్సి ఉంది. అనంతరం ఈ ఉచిత సేవలను ప్రైవేటు మెడికల్ కాలేజీలకు విస్తరించే అవకాశం ఉందని తెలుస్తోంది.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







