24 గంటల్లో కోవిడ్ మరణం నమోదు కాలేదు-షేక్ మొహమ్మద్

- July 15, 2020 , by Maagulf
24 గంటల్లో కోవిడ్ మరణం నమోదు కాలేదు-షేక్ మొహమ్మద్

యూఏఈ:యూఏఈలో కోవిడ్ మరణాల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోందని అబుధాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జయద్ అల్ నహ్యాన్ తెలిపారు. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కోవిడ్ కారణంగా ఒక్కరు కూడా చనిపోయలేదని ఆయన ప్రకటించారు. ఫ్రంట్ లైన్ వర్కర్స్ విశేష సేవల వల్లే ఇది సాధ్యమైందని ఆయన ప్రశంసించారు. ఫ్రంట్ లైన్ వర్కర్స్ తో పాటు..ప్రవాసీయుల నిబద్ధత కూడా కరోనా కట్టడికి దోహదం చేస్తోందని షేక్ మొహమ్మద్ కొనియాడుతూ ట్వీట్ చేశారు. ఇదే స్ఫూర్తితో అంతా ఒక్కటిగా కరోనా మహమ్మారిపై పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com