యూ.ఏ.ఈ:విదేశాల నుంచి వచ్చేవారు క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘిస్తే Dh50,000 జరిమానా

- July 16, 2020 , by Maagulf
యూ.ఏ.ఈ:విదేశాల నుంచి వచ్చేవారు క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘిస్తే Dh50,000 జరిమానా

యూ.ఏ.ఈ:వివిధ దేశాల నుంచి యూఏఈ వచ్చే ప్రవాసీయులు ఖచ్చితంగా క్వారంటైన్ నిబంధనలు పాటించాల్సిందేనని యూఏఈ ప్రభుత్వం మరోసారి హెచ్చరించింది. ఎట్టి పరిస్థితుల్లోనైనా క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘిస్తే Dh50,000 జరిమానా విధిస్తామని వార్నింగ్ ఇచ్చింది. లాక్ డౌన్ యూఏఈలో ఉండే ప్రవాసీయులు పలు దేశాల్లో చిక్కుకుపోయిన విషయం తెలిసింది. వాళ్లందరూ తిరిగి యూఏఈ చేరుకునేందుకు నిబంధనలను సులభతరం కూడా చేసింది. ఆగస్ట్ ఫస్ట్ నుంచి విమాన సర్వీసులను కూడా ప్రారంభించబోతోంది. అయితే..వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్న యూఏఈ..విదేశాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా క్వారంటైన్ లో ఉండాల్సిందేనని నిబంధన విధించింది. వైరస్ తక్కువ తీవ్రత ఉన్న దేశాల నుంచి వచ్చిన వారు వారం పాటు ఐసోలేషన్ లో ఉంటే సరిపోతుందని, అలాగే ఎక్కువ తీవ్రత కలిగిన దేశాల నుంచి వచ్చే వారు 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాల్సి ఉంటుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com