తెలంగాణలో కొత్తగా 1676 కరోనా పాజిటివ్ కేసులు

- July 16, 2020 , by Maagulf
తెలంగాణలో కొత్తగా 1676 కరోనా పాజిటివ్ కేసులు

హైదరాబాద్:తెలంగాణలో గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1676 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 41,018కి చేరింది. ఈ మేరకు గురువారం తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా కరోనాతో నేడు మరో పది మంది మృతిచెందగా మొత్తం మృతుల సంఖ్య 396కి చేరింది. తాజాగా కరోనా నుంచి 1296 మంది పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 27,295కు చేరింది.  ప్రస్తుతం రాష్ట్రంలో 13,328 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కొత్తగా నమోదైన కేసుల్లో GHMC పరిధిలో 788, రంగారెడ్డిలో 224, మేడ్చల్‌ నుంచి 160 ఉన్నాయి. మిగతావి ఇతర జిల్లాల నుంచి నమోదయ్యాయి.

--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com