యూఏఈ నుంచి వచ్చే అనధికార ఛార్టెర్డ్ విమానాలకు భారత్ లోకి అనుమతి లేదు: డీజీసీఏ
- July 16, 2020
యూఏఈ నుంచి భారత్ కు వచ్చే విమానాలకు తప్పనిసరిగా ముందస్తు అనుమతి ఉండాల్సిందేనని స్పష్టం చేసింది డీజీసీఏ. ఈ మేరకు యూఏఈకి లేఖ రాసింది. కొన్ని చార్టెర్డ్ విమానాలు సరైన అనుమతులు లేకుండానే ప్రయాణికులను తీసుకువస్తున్నాయని అభ్యంతరం వ్యక్తం చేసింది. యూఏఈలో చిక్కుకుపోయిన వారిని వారి సొంత ప్రాంతాలకు తరలించేందుకు భారత ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక విమానాలను నడుపుతున్న విషయం తెలిసిందే. అయితే..ఇండియాకు రావాలనుకుంటున్న వారి సంఖ్య వేలల్లో ఉండటంతో చార్టెర్డ్ విమానాలకు డిమాండ్ పెరిగింది. అయితే..భారత్ వచ్చే ఛార్టెర్డ్ విమానాలన్ని ముందస్తుగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి కూడా తీసుకోవాలని గతంలోనే షరతు విధించింది డీజీసీఏ. కానీ, ఇటీవలె ఓ ఛార్టెర్డ్ విమానం మహారాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండానే ముంబై ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యింది. దీంతో అప్రూవల్ కోసం ప్రయాణికులు విమానాశ్రయంలోనే 12 గంటల పాటు నిరీక్షించాల్సి వచ్చింది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న పౌర విమానయాన అధికారులు..రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి పత్రాలు అందిన తర్వాత యూఏఈ నుంచి వచ్చే విమానాలకు అనుమతి ఇవ్వాలంటూ ఏటీసీకి లేఖ రాసింది. దీంతో ఇకపై యూఏఈ నుంచి భారత్ వచ్చే ఛార్టెర్డ్ విమానాలన్ని ముందుగా ఆ విమానం ల్యాండ్ అయ్యే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి పొంది..ఆ పర్మిషన్ లెటర్ ను ఏటీసీకి అందిస్తేనే ల్యాండింగ్ అనుమతి ఇస్తారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







