యూఏఈ నుంచి వచ్చే అనధికార ఛార్టెర్డ్ విమానాలకు భారత్ లోకి అనుమతి లేదు: డీజీసీఏ
- July 16, 2020
యూఏఈ నుంచి భారత్ కు వచ్చే విమానాలకు తప్పనిసరిగా ముందస్తు అనుమతి ఉండాల్సిందేనని స్పష్టం చేసింది డీజీసీఏ. ఈ మేరకు యూఏఈకి లేఖ రాసింది. కొన్ని చార్టెర్డ్ విమానాలు సరైన అనుమతులు లేకుండానే ప్రయాణికులను తీసుకువస్తున్నాయని అభ్యంతరం వ్యక్తం చేసింది. యూఏఈలో చిక్కుకుపోయిన వారిని వారి సొంత ప్రాంతాలకు తరలించేందుకు భారత ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక విమానాలను నడుపుతున్న విషయం తెలిసిందే. అయితే..ఇండియాకు రావాలనుకుంటున్న వారి సంఖ్య వేలల్లో ఉండటంతో చార్టెర్డ్ విమానాలకు డిమాండ్ పెరిగింది. అయితే..భారత్ వచ్చే ఛార్టెర్డ్ విమానాలన్ని ముందస్తుగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి కూడా తీసుకోవాలని గతంలోనే షరతు విధించింది డీజీసీఏ. కానీ, ఇటీవలె ఓ ఛార్టెర్డ్ విమానం మహారాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండానే ముంబై ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యింది. దీంతో అప్రూవల్ కోసం ప్రయాణికులు విమానాశ్రయంలోనే 12 గంటల పాటు నిరీక్షించాల్సి వచ్చింది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న పౌర విమానయాన అధికారులు..రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి పత్రాలు అందిన తర్వాత యూఏఈ నుంచి వచ్చే విమానాలకు అనుమతి ఇవ్వాలంటూ ఏటీసీకి లేఖ రాసింది. దీంతో ఇకపై యూఏఈ నుంచి భారత్ వచ్చే ఛార్టెర్డ్ విమానాలన్ని ముందుగా ఆ విమానం ల్యాండ్ అయ్యే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి పొంది..ఆ పర్మిషన్ లెటర్ ను ఏటీసీకి అందిస్తేనే ల్యాండింగ్ అనుమతి ఇస్తారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







