ఖతార్:సెప్టెంబర్ 1 నుంచి స్కూల్స్ ప్రారంభం..
- July 17, 2020
దోహా:లాక్ డౌన్ తర్వాత తిరిగి సాధారణ జనజీవనం దిశగా అడుగులు వేస్తున్న ఖతార్ ప్రభుత్వం..ఇక స్కూళ్ల పున:ప్రారంభంపై ఫోకస్ చేసింది. దశల వారిగా అన్ లాక్ మార్గదర్శకాలను జారీ చేస్తున్న ప్రభుత్వం..2020-2021 విద్యాసంవత్సరానికి సంబంధించి షెడ్యూల్ విడుదల చేసింది. ఈ మేరకు సెప్టెంబర్ 1 నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లను ప్రారంభిస్తున్నట్లు విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే..ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్ ఉద్యోగులు మాత్రం వచ్చే నెల 19 నుంచే విధులకు హజరుకావాలని కూడా సూచించింది. అంతేకాదు...ఉద్యోగులు, విద్యార్ధులు అటెండెన్స్ విషయంలో ఎలాంటి మినహాయింపులు లేవని కూడా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయితే..కరోనా నేపథ్యంలో ఉద్యోగులు, విద్యార్ధుల ఆరోగ్య భద్రతకు అన్ని ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని కూడా ఆదేశించింది.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







