మస్కట్:ఇండియా నుంచి ఒమన్ వెళ్లే ప్రవాసీయులకు కొత్త మార్గదర్శకాలు జారీ
- July 17, 2020
మస్కట్:ఇండియా నుంచి ఓమన్ వెళ్లాలనుకుంటున్న ప్రవాసీయులకు భారత్ లోని ఓమన్ రాయబార కార్యాలయం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. లాక్ డౌన్ తో ఇండియాలోనే చిక్కుకుపోయిన ప్రవాస భారతీయులు తిరిగి ఓమన్ వెళ్లేందుకు ఇరు దేశాల అనుమతి తప్పనిసరి అని ప్రకటించింది. ఈ మేరకు ఇండియాలోని ఓమన్ రాయబార కార్యాలయం ప్రవాస భారతీయులకు కొన్ని సూచనలు చేసింది. ఓమన్ లోని తమ కుటుంబ సభ్యులు లేదా వారు పని చేసే కంపెనీ యాజమాన్యం ద్వారా సంబంధిత అధికారులకు దరఖాస్తు చేసుకొని ఎంట్రీ పర్మిట్ పొందాలని తెలిపింది. ఆ అనుమతి పత్రాల ద్వారా తమ ప్రయాణానికి స్థానికంగా క్లియరెన్స్ చేసుకోవాలని, ఆ తర్వాత ఇండియాలోని ఓమన్ రాయబార కార్యాలయం ప్రవాసీయుల ప్రయాణానికి తగిన ఏర్పాట్లు చేస్తుందని అధికారులు వివరించారు. నిజానికి ప్రస్తుత సంక్షోభ పరిస్థితులతో రెండు దేశాల మధ్య పౌర విమానయాన సౌకర్యాలు రద్దైపోయాయి. అయితే..ఇండియాలో చిక్కుకుపోయిన ప్రవాసీయులను మానవతా కోణంలో తిరిగి ఓమన్ తరలిచేందుకు ప్రత్యేకంగా విమానాలు నడుపుతున్నట్లు రాయబార కార్యాలయం గుర్తు చేసింది.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







