మస్కట్:ఇండియా నుంచి ఒమన్ వెళ్లే ప్రవాసీయులకు కొత్త మార్గదర్శకాలు జారీ
- July 17, 2020
మస్కట్:ఇండియా నుంచి ఓమన్ వెళ్లాలనుకుంటున్న ప్రవాసీయులకు భారత్ లోని ఓమన్ రాయబార కార్యాలయం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. లాక్ డౌన్ తో ఇండియాలోనే చిక్కుకుపోయిన ప్రవాస భారతీయులు తిరిగి ఓమన్ వెళ్లేందుకు ఇరు దేశాల అనుమతి తప్పనిసరి అని ప్రకటించింది. ఈ మేరకు ఇండియాలోని ఓమన్ రాయబార కార్యాలయం ప్రవాస భారతీయులకు కొన్ని సూచనలు చేసింది. ఓమన్ లోని తమ కుటుంబ సభ్యులు లేదా వారు పని చేసే కంపెనీ యాజమాన్యం ద్వారా సంబంధిత అధికారులకు దరఖాస్తు చేసుకొని ఎంట్రీ పర్మిట్ పొందాలని తెలిపింది. ఆ అనుమతి పత్రాల ద్వారా తమ ప్రయాణానికి స్థానికంగా క్లియరెన్స్ చేసుకోవాలని, ఆ తర్వాత ఇండియాలోని ఓమన్ రాయబార కార్యాలయం ప్రవాసీయుల ప్రయాణానికి తగిన ఏర్పాట్లు చేస్తుందని అధికారులు వివరించారు. నిజానికి ప్రస్తుత సంక్షోభ పరిస్థితులతో రెండు దేశాల మధ్య పౌర విమానయాన సౌకర్యాలు రద్దైపోయాయి. అయితే..ఇండియాలో చిక్కుకుపోయిన ప్రవాసీయులను మానవతా కోణంలో తిరిగి ఓమన్ తరలిచేందుకు ప్రత్యేకంగా విమానాలు నడుపుతున్నట్లు రాయబార కార్యాలయం గుర్తు చేసింది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







