అయోధ్య:ఆగస్టులో రామాలయ శంకుస్థాపన
- July 17, 2020అయోధ్య:అయోధ్యలో రామాలయ నిర్మాణానికి శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు సర్వం సిద్ధం చేస్తుంది. ఆలయ శంకుస్థాపన తేదీని ఆదివారం ఖరారు చేయనున్నారు. శంకుస్థాపన పనులకు ప్రధాని మోదీని ఆహ్వానించాలని ట్రస్టు సభ్యులు నిర్ణయించారు. మోదీకి ఆమోదంగా ఉన్న రోజున శంకుస్థాపనకు సిద్దం చేస్తామని అన్నారు. తేదీ ఖరారు చేసిన తరువాత ప్రధానికి ఆహ్వానం పంపిస్తామని.. మోదీతోపాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ను కూడా ఆహ్వానిస్తామని ట్రస్టు చైర్మన్ నృపేంద్ర మిశ్రా అన్నారు. ఆగస్టులో ఏదో ఒక రోజు శంకుస్థాపనకు సిద్దం అవుతున్నట్టు ట్రస్టు సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులతోపాటు.. చాలా మంది ప్రముఖులు పాల్గొంటారని ట్రస్టు తెలిపింది.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం