సుశాంత్ కేసులో సీబీఐ విచారణ అక్కర్లెదు : హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్

- July 17, 2020 , by Maagulf
సుశాంత్ కేసులో సీబీఐ విచారణ అక్కర్లెదు : హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య సీబీఐ విచారణ జరిపించాలంటూ డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ విషయంపై మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ స్పందించారు. సుశాంత్ కేసులో సీబీఐ విచారణ అక్కర్లేదని, ముంబయి పోలీసుల విచారణ సరిపోతుందని అన్నారు. ఇలాంటి కేసులను చేపట్టడంలో ముంబయి పోలీసులు సమర్థవంతులేనని చెప్పారు. సుశాంత్ కు బాలీవుడ్ లో ఉన్న వృత్తి వైరం సహా అనేక కోణాల్లో ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, సీబీఐతో విచారణ ఎందుకని ప్రశ్నించారు. సుశాంత్ ఆత్మహత్య వ్యవహారంలో ఎవరి తప్పిదం ఉన్నట్టు తెలియరాలేదని. దర్యాప్తు మొత్తం పూర్తయ్యాక వివరాలు తెలుపుతామన్నారు అనిల్ దేశ్ ముఖ్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com