భారత్ లో పెట్రోల్, డీజిల్కు తగ్గిన డిమాండ్
- July 17, 2020
దేశంలో పెట్రోల్, డీజిల్కు డిమాండ్ భారీగా పడిపోయింది. పలు నగరాల్లో తిరిగి లాక్డౌన్ విధించడం, పెరుగుతున్న ధరల వంటి కారణాలతో ఈ నెల మొదటి అర్ధభాగంలో పెట్రోలు, డీజిల్కు డిమాండ్ తగ్గింది. ఇక గత నెల ఇదే సమయంతో పోలిస్తే కూడా డిమాండ్ బాగా తగ్గినట్టు గణాంకాలు చెబుతున్నాయి. చమురు దిగుమతి, వినియోగంలో భారత్ది ప్రపంచంలోనే మూడో స్థానం కాగా, లాక్డౌన్ అమల్లో ఉన్న ఏప్రిల్లో పెట్రో అమ్మకాలు రికార్డు స్థాయిలో పడిపోయాయి. జూలై తొలి అర్ధ భాగంలో డీజిల్ అమ్మకాలు 18 శాతానికి పడిపోయి 2.2 మిలియన్ టన్నుల అమ్మకాలు మాత్రమే జరిగాయి. జూన్లో ఇదే సమయంలో దాదాపు 21 శాతం డీజిల్ విక్రయాలు జరిగినట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ గణాంకాలు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







