షార్జా:నకిలీ బంగారు నాణేలు అమ్ముతున్న ముఠా గుట్టురట్టు..8 మంది అరెస్ట్
- July 19, 2020
షార్జా:నకిలీ బంగారు నాణేలు అమ్ముతూ మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎనిమిది మంది సభ్యులు ఉన్న ఈ ముఠా కొన్నాళ్లుగా మోసాలకు పాల్పడుతోంది. అమాయకులను టార్గెట్ గా చేసుకొని..వారిని బురిడి కొట్టిస్తారు. ముందుగా బంగారు నాణేలు చూపించి డీల్ కుదుర్చుకుంటారు. డబ్బు చేతిలో పడగానే నకిలీ బంగారు నాణేలు ఉన్న బ్యాగులను ఇచ్చి అక్కడి నుంచి క్షణాల్లో పరారవుతారు. ఇలాగే మోసపోయిన ఇద్దరు ప్రవాసీయులు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో వ్యవహారం బయటపడింది. బాధితుల ఫిర్యాదుతో అప్రమత్తమైన పోలీసులు తనిఖీలు చేపట్టగా..ఓ అసియా వ్యక్తి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. అతని నుంచి రెండు బ్యాగుల నిండా నకిలీ బంగారు నాణేలు ఉన్నట్లు గుర్తించారు. పట్టుబడిన అసియా వ్యక్తి ద్వారా మిగిలిన ముఠా సభ్యుల సమాచారం కూడా పోలీసులు తెలుసుకున్నారు. దీంతో అందర్ని అరెస్ట్ చేసిన పోలీసులు తదుపరి న్యాయవిచారణకు కేసును బదిలీ చేశారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?