కువైట్: 91 ఏళ్ల పాలకుడికి విజయవంతంగా శస్త్రచికిత్స..ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రకటన
- July 19, 2020
కువైట్: కువైట్ యొక్క 91 ఏళ్ల పాలకుడు ఎమిర్ 'షేక్ సబా అల్ అహ్మద్ అల్ సబా' ను వైద్యపరీక్షలకై శనివారం ఆసుపత్రిలో చేర్పించిన అనంతరం ఆదివారం ఉదయం శస్త్రచికిత్స నిర్వహించారనీ అది వియవంతంగా ముగిసిందని ఎమిర్ కార్యాలయం తెలిపింది. కానీ, ఎలాంటి శస్త్రచికిత్స చేయించుకున్నారో పేర్కొనలేదు. దీంతో పాలకుడు ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన నెలకొంది.
శస్త్రచికిత్స తదుపరి విశ్రాంతి తీసుకుంటున్న ఎమిర్ స్థానంలో నియమించబడిన వారసుడు క్రౌన్ ప్రిన్స్ షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ సబా శనివారం రాజ్యాంగ విధులను తాత్కాలికంగా చేపట్టారు.
గత ఏడాది, ఆగస్టులో కువైట్లో అధికారిక పర్యటనలో ఉండగా ఎమిర్ ఆరోగ్య సమస్యలు ఎదుర్కోగా చికిత్సకై అమెరికాలో ఆసుపత్రిలో చేర్చారు అని ఆయన కార్యాలయం తెలిపింది. చికిత్స ముగించుకొని అక్టోబర్లో గల్ఫ్ అరబ్ రాష్ట్రానికి ఎమిర్ తిరిగి వచ్చారు.
కువైట్ ఎమిర్ త్వరగా కోలుకోవాలని శుభాకాంక్షలు తెలిపిన ప్రపంచ నేతలు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







