కువైట్: 91 ఏళ్ల పాలకుడికి విజయవంతంగా శస్త్రచికిత్స..ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రకటన
- July 19, 2020
కువైట్: కువైట్ యొక్క 91 ఏళ్ల పాలకుడు ఎమిర్ 'షేక్ సబా అల్ అహ్మద్ అల్ సబా' ను వైద్యపరీక్షలకై శనివారం ఆసుపత్రిలో చేర్పించిన అనంతరం ఆదివారం ఉదయం శస్త్రచికిత్స నిర్వహించారనీ అది వియవంతంగా ముగిసిందని ఎమిర్ కార్యాలయం తెలిపింది. కానీ, ఎలాంటి శస్త్రచికిత్స చేయించుకున్నారో పేర్కొనలేదు. దీంతో పాలకుడు ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన నెలకొంది.
శస్త్రచికిత్స తదుపరి విశ్రాంతి తీసుకుంటున్న ఎమిర్ స్థానంలో నియమించబడిన వారసుడు క్రౌన్ ప్రిన్స్ షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ సబా శనివారం రాజ్యాంగ విధులను తాత్కాలికంగా చేపట్టారు.
గత ఏడాది, ఆగస్టులో కువైట్లో అధికారిక పర్యటనలో ఉండగా ఎమిర్ ఆరోగ్య సమస్యలు ఎదుర్కోగా చికిత్సకై అమెరికాలో ఆసుపత్రిలో చేర్చారు అని ఆయన కార్యాలయం తెలిపింది. చికిత్స ముగించుకొని అక్టోబర్లో గల్ఫ్ అరబ్ రాష్ట్రానికి ఎమిర్ తిరిగి వచ్చారు.
కువైట్ ఎమిర్ త్వరగా కోలుకోవాలని శుభాకాంక్షలు తెలిపిన ప్రపంచ నేతలు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు