దుబాయ్:లారీని ఢీకొన్న బస్సు..నలుగురు మృతి, 12 మందికి గాయాలు

- July 19, 2020 , by Maagulf
దుబాయ్:లారీని ఢీకొన్న బస్సు..నలుగురు మృతి, 12 మందికి గాయాలు

దుబాయ్:దుబాయ్ లో కార్మికులను తరలిస్తున్న బస్సు, లారీని ఢికొన్న ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందగా, పన్నెండు మందికి గాయాలయ్యాయి. ఎమిరాతి రోడ్డులో కుడి నుంచి మూడో లైనులో వెళ్తున్న లారీలో అనుకోకుండా సమస్య తలెత్తింది. అయితే..లారీ డ్రైవర్ ప్రమాదాన్ని సూచించే లైట్లను ఆన్ చేయకపోవటంతో వెనక నుంచి వస్తున్న బస్సు డ్రైవర్ లారీని గుర్తించలేకపోవటంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. యాక్సిడెంట్ జరిగినట్లు సమాచారం అందగానే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని రషీద్ ఆస్పత్రికి తరలించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com