దోహాలో ఆత్మహత్య చేసుకున్న ఏ.పి మహిళ

- July 19, 2020 , by Maagulf
దోహాలో ఆత్మహత్య చేసుకున్న ఏ.పి మహిళ

దోహా:వైఎస్ఆర్సీపీ గల్ఫ్ ప్రతినిధి మండా వర్జిల్ బాబు తెలిపిన వివరాల ప్రకారం, తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం సంకరగుప్తం గ్రామానికి  చెందిన తాడి విజయలక్షి(43) గత 2  నెలల క్రితం ఖతార్ లో ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది.తాడి విజయలక్షి మృతి చెందిన విషయం తెలుసుకున్న ఖత్తర్ లోని బిషప్ ఓగూరి బుల్లబ్బాయి గారు APNRTS కో-ఆర్డినేటర్  మరియు వైఎస్ఆర్సీపీ గల్ఫ్ ప్రతినిధి మండా వర్జిల్ బాబు తెలుపగా,ఖతార్ లోని భారత రాయబార కార్యాలయ అధికారులు ధీరజ్,ICBF మెంబెర్ రజనీ మూర్తి తో మాట్లాడి ఎమిగ్రేషన్ మరియు పేపర్ వర్క్ పనులు పూర్తి చేయించినారు.బాడి బాక్సు విమాన టికెట్ ఖర్చులు రాయబార కార్యాలయం వారు సమకూర్చారు. నిన్న ఖతార్ ఎయిర్ వేస్ విమానం ద్వారా, మృతదేహం హైదరాబాద్ కు పంపండం జరిగింది. ఖతార్ లోని భారత రాయబార కార్యాలయం వారికి మండా వర్జీల్ బాబు కృతజ్ఞతలు తెలిపారు. 

అలాగే హైదరాబాదు విమానాశ్రయం నుంచి మృతురాలి  స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం సంకరగుప్తం గ్రామానికి APNRTS వారి సహకారంతో, ఉచిత ఏంబులెన్స్ సౌకర్యం కల్పించినారు.బిషప్ ఓగూరి బుల్లబ్బాయి ఆధ్వర్యంలో విల్సన్ బాబు, నాగేశ్వర్రావు, వెంకట్  తదితరులు ప్రార్ధన చేసి నివాళులు అర్పించారు.

మండా, వర్జిల్ బాబు మాట్లాడుతూ, ఉచిత ఏంబులెన్స్ సౌకర్యం కల్పించిన మేడపాటి వెంకట్( APNRTS ఛైర్మన్) , బి.హెచ్ ఇలియాస్(డైరెక్టర్)కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు మృతదేహం స్వస్థలం చేరింది.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com