మస్కట్:వశీకరణం, మంత్రవైద్యం పేరుతో మోసం..ముగ్గురు అరెస్ట్
- July 19, 2020
మనామా:వశీకరణం పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ముగ్గుర్ని ఓమన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. రాయల్ ఓమన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..యూరోపియన్, అరబ్ మహిళలు స్థానిక వ్యక్తితో కలిసి మంత్రవైద్యం పేరుతో ప్రజలను దోచుకుంటున్నారు. తమకు వశీకరణం విద్య తెలుసని నమ్మించటంతో పాటు బూత ప్రేత పీడుతులను విముక్తి కలిగిస్తామని, అలాగే తమ మంత్ర విద్యలతో వివిధ రుగ్మతలను తగ్గిస్తామని ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నట్లు పోలీసులువెల్లడించారు. మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారిని బూత ప్రేత పీడుతలుగా నమ్మిస్తూ వచ్చారు. వీరి మోసాలపై సమాచారం అందుకున్న పోలీసులు ముగ్గుర్ని అరెస్ట్ చేశారు. మంత్రవిద్యలు, మంత్ర వైద్యం అంటూ మోసాలకు పాల్పడే వారిని ప్రజలు నమ్మొద్దని, వారి గురించి వెంటనే తమకు సమాచారం అందించాలని కోరారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







