మస్కట్:వశీకరణం, మంత్రవైద్యం పేరుతో మోసం..ముగ్గురు అరెస్ట్
- July 19, 2020
మనామా:వశీకరణం పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ముగ్గుర్ని ఓమన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. రాయల్ ఓమన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..యూరోపియన్, అరబ్ మహిళలు స్థానిక వ్యక్తితో కలిసి మంత్రవైద్యం పేరుతో ప్రజలను దోచుకుంటున్నారు. తమకు వశీకరణం విద్య తెలుసని నమ్మించటంతో పాటు బూత ప్రేత పీడుతులను విముక్తి కలిగిస్తామని, అలాగే తమ మంత్ర విద్యలతో వివిధ రుగ్మతలను తగ్గిస్తామని ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నట్లు పోలీసులువెల్లడించారు. మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారిని బూత ప్రేత పీడుతలుగా నమ్మిస్తూ వచ్చారు. వీరి మోసాలపై సమాచారం అందుకున్న పోలీసులు ముగ్గుర్ని అరెస్ట్ చేశారు. మంత్రవిద్యలు, మంత్ర వైద్యం అంటూ మోసాలకు పాల్పడే వారిని ప్రజలు నమ్మొద్దని, వారి గురించి వెంటనే తమకు సమాచారం అందించాలని కోరారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







