మస్కట్:వశీకరణం, మంత్రవైద్యం పేరుతో మోసం..ముగ్గురు అరెస్ట్
- July 19, 2020
మనామా:వశీకరణం పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ముగ్గుర్ని ఓమన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. రాయల్ ఓమన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..యూరోపియన్, అరబ్ మహిళలు స్థానిక వ్యక్తితో కలిసి మంత్రవైద్యం పేరుతో ప్రజలను దోచుకుంటున్నారు. తమకు వశీకరణం విద్య తెలుసని నమ్మించటంతో పాటు బూత ప్రేత పీడుతులను విముక్తి కలిగిస్తామని, అలాగే తమ మంత్ర విద్యలతో వివిధ రుగ్మతలను తగ్గిస్తామని ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నట్లు పోలీసులువెల్లడించారు. మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారిని బూత ప్రేత పీడుతలుగా నమ్మిస్తూ వచ్చారు. వీరి మోసాలపై సమాచారం అందుకున్న పోలీసులు ముగ్గుర్ని అరెస్ట్ చేశారు. మంత్రవిద్యలు, మంత్ర వైద్యం అంటూ మోసాలకు పాల్పడే వారిని ప్రజలు నమ్మొద్దని, వారి గురించి వెంటనే తమకు సమాచారం అందించాలని కోరారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!